దుబాయ్‌ ఇండియన్ కాన్సులేట్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి

దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఠాగూర్ బియాండ్ హారిజోన్’ అనే ఆల్బమ్‌లో 3

Published : 09 May 2022 17:51 IST

దుబాయి: దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఠాగూర్ బియాండ్ హారిజోన్’ అనే ఆల్బమ్‌లో 3 ఐకానిక్ పాటలను విడుదల చేశారు. ఠాగూర్ రాసిన మూడు పాటలు అరబిక్‌లోకి అనువదించడం, సమర్పించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ మూడు పాటలను ప్రఖ్యాత ఎమిరాటి కవి డా. షిహాబ్ ఘనేమ్ బెంగాల్ భాష నుంచి అరబిక్‌లోకి అనువదించారు. ఈ పాటలను దేవ్ చక్రవర్తి స్వరపరిచారు, సంగీతాన్ని అందించారు. 130 భాషల్లో పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పిన సుచేత సతీష్ ఈ మూడు పాటలను పాడారు. దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా అమన్ పూరి పాటలను విడుదల చేశారు.

కార్యక్రమానికి టాడు మాము అధ్యక్షత వహించారు. భారతీయ పునరుజ్జీవనానికి ఠాగూర్‌ చిహ్నం లాంటివారని అన్నారు. ప్రజల్లో పాతుకుపోయిన సంగీత సంప్రదాయం అభివృద్ధికి ఠాగూర్‌ అపారమైన కృషి చేసినట్లు చెప్పారు. సుచేత, దేవ్ చక్రవర్తి కలిసి బెంగాలీ నుంచి అరబిక్‌లోకి అనువదించిన పాటలను ఆలపించారు. భారత్‌, యూఏఈ సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం డా. ఘనేం, దేవ్, సుచేత సతీష్ కలిసి మరిన్ని పాటల అనువాదంపై పనిచేస్తున్నారు. కార్యక్రమంలో ఇండియన్ పీపుల్స్ ఫోరంకు చెందిన ప్రదీప్ మురళీ, సుమీత, కుంభాల మహేందర్ రెడ్డి, శివ కుమార్, ఇండియన్ కాన్సులేట్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని