దుబాయ్‌లో తెదేపా ఆధ్వర్యంలో రంజాన్‌ తోఫా పంపిణీ

యూఏఈ తెదేపా ఆధ్వర్యంలో దుబాయ్‌లో ఆదివారం రంజాన్‌ తోఫా పంపిణీ చేశారు.

Published : 24 Apr 2022 20:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూఏఈ తెదేపా ఆధ్వర్యంలో దుబాయ్‌లో ఆదివారం రంజాన్‌ తోఫా పంపిణీ చేశారు. తెదేపా నేత షేక్‌ ఖాదర్‌ బాషా కుమార్తె షేక్‌ వఫిఖా చేతులమీదుగా వీటిని అందజేశారు. హౌస్‌ మెయిడ్‌లుగా ఉన్న కరవా ప్రాంతంలో ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున సుమారు 500 మందికి రంజాన్‌ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఖాదర్‌ బాషా మాట్లాడుతూ రంజాన్‌ మాసం తమకెంతో పవిత్రమైనదని.. తెదేపా ఆధ్వర్యంలో ఇలా బియ్యం పంపిణీ చేయడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. పార్టీ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కోడి రవికిరణ్‌, కందుల పార్థసారథి, వినోద్‌రెడ్డి మాదా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని