చంద్రబాబుకు సంఘీభావంగా షికాగోలో రిలే నిరాహారదీక్ష

చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా అమెరికాలోని షికాగోలో తెదేపా కార్యకర్తలు, అభిమానులు రిలే నిరాహారదీక్ష చేశారు.

Updated : 19 Sep 2023 00:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా అమెరికాలోని షికాగోలో తెదేపా కార్యకర్తలు, అభిమానులు రిలే నిరాహారదీక్ష చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు దీక్షలో కూర్చొని చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ అభివృద్ధి ఎలా జరిగిందో గుర్తు చేసుకున్నారు. తద్వారా తాము అమెరికా రావడానికి ఆయన ఎలా కారణమయ్యారో వివరించారు. లక్షల మందికి సాఫ్ట్‌వేర్‌ రంగంలో శిక్షణ ఇచ్చి, వేలమంది యువతకు ఉద్యోగాలు కల్పించిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందనడం కేవలం ఆరోపణలు మాత్రమే అన్నారు. ఆధారాలు లేకుండా, కేవలం వ్యక్తిగత కక్షతోనే కేసు పెట్టారన్నారు. ఏపీలోని ప్రభుత్వ వ్యవస్థలను భ్రష్టు పట్టించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్నారు. యుగంధర్ యడ్లపాటి నిమ్మరసం ఇచ్చి రిలే నిరాహారదీక్షని విరమింపజేశారు. చంద్రబాబు అరెస్టుతో షికాగోలోని ఆయన అభిమానులు ఆందోళన చెందారు. ఆ రోజు నుంచి ఎన్ఆర్‌ఐ తెదేపా ఆధ్వర్యంలో పలువురు వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 

రిలే నిరాహారదీక్షలో హేమ కానూరు, రవి కాకర, హను చెరుకూరి, విజయ్ కొరపాటి, రఘు చిలుకూరి, చిరంజీవి గల్లా, హరీశ్‌ జమ్ముల, శ్రీనివాస్ అట్లూరి, మహేష్ కాకరాల, మూర్తి కొప్పాక, సతీష్ వీరపనేని, వినోజ్ చనుమోలు, మురళి కలగార, సతీష్ యలమంచిలి, అశోక్ పరుచూరి, శ్రీహర్ష గరికిపాటి, శివ, మహేష్, త్రివేది, శశి, ప్రకాష్, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు. వీరి దీక్షకు జనసేన అభిమానులు మద్దతు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని