ఖతార్లో ఘనంగా ‘ఆంధ్ర కళా వేదిక’ సంక్రాంతి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోని ప్రవాస భారతీయులూ సంక్రాంతి సంబరాల్ని ఎంతో ఘనంగా జరుపుకొన్నారు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తూ.......
ఖతార్: తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోని ప్రవాస భారతీయులూ సంక్రాంతి సంబరాల్ని ఎంతో ఘనంగా జరుపుకొన్నారు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తూ మన దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఖతార్లోని ‘ఆంధ్ర కళా వేదిక’ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త కార్యవర్గం ‘వెంకప్ప భాగవతుల’ అధ్యక్షతన నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఇంటిల్లిపాది సంప్రదాయ వస్త్రధారణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొవిడ్ నేపథ్యంలో మాస్కులు ధరిస్తూ వేడుకలను జరుపుకొన్నారు. ఇండియన్ కల్చరల్ సెంటర్లోని అశోకా హాలులో నిర్వహించిన ఈ వేడుకల్లో ఖతార్లో భారత రాయబారి డాక్టర్ దీపక్ మిత్తల్, మేడమ్ అంబాసిడర్ డాక్టర్ అల్పనా మిత్తల్తో పాటు ఐసీసీ సమన్వయ అధికారి జేవియర్ ధనరాజ్ తదితరులు పాల్గొని మహిళలు వేసిన రంగవల్లులను తిలకించారు. అలాగే గాలిపటాలను ఎగురవేసి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. రంగోలి మేళాలో విజేతలుగా నిలిచిన నీరజా రెడ్డి కందుల (తొలి స్థానం), కవితా మురళీ మురుగన్ (రెండో స్థానం), గాయత్రి మొగరాలా (మూడో స్థానం)లకు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో ఐసీసీ అధ్యక్షుడు పీఎన్ బాబురాజన్, ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్, ఐసీసీ అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్మన్ కేఎస్ ప్రసాద్, ఐసీబీఎఫ్ అధ్యక్షుడు జియాద్ ఉస్మాన్, రజనీ మూర్తితో పాటు మణికంఠన్, వినోద్ నాయర్, సుబ్రహ్మణ్య హెబ్బగులు, సబిత్ సాహిర్ సహా అనేకమంది ప్రముఖులు ,ఇతర తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రకళా వేదిక కొత్త మేనేజ్మెంట్ బృందం ప్రమాణ స్వీకారం, సాంస్కృతిక కార్యక్రమాలు, గొబ్బిళ్ళ నాట్యాలు, హరిదాసు, గోదాదేవి అలంకరణలో పిల్లలకు భోగిపళ్లు, కార్యనిర్వాహక వర్గ కుటుంబాలు తయారు చేసిన రుచికరమైన తెలుగింటి వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సంక్రాంతి సంబరాలకు శిరీషా రామ్, శ్రీసుధ వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా.. ఆంధ్ర కళావేదిక ప్రధాన కార్యదర్శి విక్రమ్ సుఖవాసి ప్రారంభ సందేశం ఇచ్చారు. అధ్యక్షులు వెంకప్ప భాగవతుల ముగింపు సందేశ ధన్యవాదాలతో ఈ కార్యక్రమం ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలి వార్షిక సదస్సు ఘనంగా నిర్వహించాలని ‘మాటా’ బోర్డు నిర్ణయం
వచ్చే ఏడాది ఏప్రిల్ 13, 14 తేదీలలో న్యూజెర్సీలో రాయల్ అల్బర్ట్ ప్యాలెస్లో 'మాటా' తొలి వార్షిక సదస్సును ఘనంగా నిర్వహించాలని బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. -
‘చంద్రమోహనునికి ప్రపంచవ్యాప్తంగా ఘన నివాళి’
ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్కు వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. -
Hongkong: హాంకాంగ్ తెలుగు సామాఖ్య ఆధ్వర్యంలో కార్తిక వనభోజనాలు
హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ట్యూన్ మున్ కంట్రీ పార్కులో కార్తిక మాస వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. -
శివపదం గీతాలకు బాలిలో అద్భుత నృత్య ప్రదర్శన
శివపదం గ్లోబల్ ఫ్యామిలీ ఇండోనేషియాలోని బాలిలో భారతీయ శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించింది. తద్వారా ఏకత్వ సందేశాన్ని, కళలకు సరిహద్దులు లేవని చాటి చెప్పింది -
H-1B visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్న్యూస్.. ఇక అమెరికాలోనే వీసా రెన్యువల్!
H-1B visa: అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్ నిపుణులకు అగ్రరాజ్యం గుడ్న్యూస్ చెప్పింది. స్వదేశాలకు వెళ్లకుండానే ఎన్నారైలు తమ హెచ్-1బీ వీసాలను రెన్యువల్ చేసుకునేలా ఓ పైలట్ ప్రోగ్రామ్ను డిసెంబరు నుంచి అందుబాటులోకి తీసుకొస్తోంది. -
NRI: న్యూజెర్సీలో వైభవంగా కార్తిక పౌర్ణమి వేడుకలు.. పాల్గొన్న సింగర్ మంగ్లీ
అమెరికాలో.. న్యూజెర్సీలోని సాయిదత్తా పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా సింగర్ మంగ్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె శివుడి పాట పాడారు. మంగ్లీ ఆలపించిన పాటతో భక్తులు మంత్ర ముగ్ధులయ్యారు.
-
శివ నామస్మరణతో మార్మోగిన లిమెరిక్ నగరం
కార్తిక మాసం సందర్భంగా ఐర్లాండ్లోని లిమెరిక్ నగరం శివనామస్మరణతో మార్మోగింది. -
ఉత్సాహంగా తానా ‘నెల నెలా తెలుగు వెలుగు’ సాహిత్య సభ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెలుగు’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. -
సింగపూర్లో భక్తి శ్రద్ధలతో కార్తిక వన భోజనాలు
వాసవి క్లబ్ మెర్లియన్ సింగపూర్ ఆధ్వర్యంలో కార్తిక వన భోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. -
తాకా ఆధ్వర్యంలో కెనడాలో ఘనంగా దీపావళి వేడుకలు
తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (TACA) ఆధ్వర్యంలో నవంబరు 18న కెనడాలోని గ్రేటర్ టోరొంటో మిస్సిస్సౌగ ఫీల్డ్ గేట్ ఉన్నత పాఠశాలలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. -
NRI: కెనడాలోని టొరొంటోలో ప్రవాసాంధ్రుల దీపావళి సంబరాలు
కెనడాలోని టొరొంటోలోని తెలుగువారు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దాదాపు 800 ఎన్నారై కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యం కూచిపూడి ప్రదర్శించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలతో చిన్నారులు, కళాకారులు అలరించారు.
-
India-Canada: కెనడియన్లకు ఈ-వీసా సేవల పునరుద్ధరణ.. జీ20 భేటీ వేళ భారత్ కీలక నిర్ణయం!
India-Canada: కెనడా పౌరులకు ఈ-వీసా సేవల (E-Visa Services)ను భారత్ పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. దీంతో కెనడియక్లకు అన్ని రకాల వీసా సేవలను అందుబాటులోకి తెచ్చినట్లైంది. -
టాస్-యూకే ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-యూకే (టాస్-యూకే) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. -
కెనడా డీటీసీ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబరాలు
కెనడాలోని టొరంటో నగరంలో డుర్హం తెలుగు క్లబ్ (డీటీసీ) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
యూఏఈ తెలుగు అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
యూఏఈ తెలుగు అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం దుబాయిలోని రాయల్ కాంకర్డ్ హోటల్లో నిర్వహించినట్లు సంఘం మీడియా డైరెక్టర్ అబ్దుల్ ఫహీమ్ షేక్ ఓ ప్రకటనలో తెలిపారు. -
హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు
ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
Qatar: ఖతార్లో కార్తికమాస వనభోజనాలు..పెద్ద సంఖ్యలో హాజరైన ప్రవాసులు
ఖతార్లో కార్తిక మాస వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.దీనికి పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు హాజరయ్యారు. -
Chandrababu: అక్రమ కేసుల నుంచి చంద్రబాబు బయటపడాలని ఆకాంక్షిస్తూ శాంతిహోమం
అక్రమ కేసుల నుంచి తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడిగిన ముత్యంలాగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ ఫిలడెల్ఫియాలో శాంతి హోమం నిర్వహించారు. -
పలు సేవల కోసం ప్రవాసులకు సభ్యత్వం ప్రారంభించిన ‘స్వదేశం’
ప్రవాసులకు సేవలు అందిస్తున్న ‘స్వదేశం’ (swadesam) సంస్థ మెంబర్షిప్ ప్రారంభించింది. దీనికి సంబంధించి డిజిటల్ ఐడీ కార్డులను అందించబోతోంది. దీనివల్ల ‘స్వదేశం’ సభ్యత్వం తీసుకున్న వారికి మరింత వేగంగా తమ సేవలు అందించడం సులువవుతుందని నిర్వాహకులు స్వాతి తెలిపారు. -
ఘనంగా సింగపూర్ తెలుగు సమాజం 49వ ఆవిర్భావ వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడి సీనియర్ సిటిజన్లతో సరదాగా గడిపి వారి అనుభవాలను తెలుసుకున్నారు. -
కాన్సాస్లో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక బ్లూ వ్యాలీ నార్త్ హైస్కూలో ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించారు.