1985 నాటి ఎయిరిండియా పేలుళ్ల కేసులో నిర్దోషి.. దారుణ హత్య
దాదాపు 35 సంవత్సరాల క్రితం ఎయిరిండియా విమానాన్ని ఉగ్రవాదులు పేల్చేసిన కేసులో నిర్దోషిగా తేలిన ఓ సిక్కు వ్యక్తి.. కెనడాలో దారుణ హత్యకు గురయ్యారు. 75 ఏళ్ల రిపుదమన్ సింగ్ మాలిక్ను సర్రే ప్రాంతంలో
టొరొంటో: దాదాపు 35 సంవత్సరాల క్రితం ఎయిరిండియా విమానాన్ని ఉగ్రవాదులు పేల్చేసిన కేసులో నిర్దోషిగా తేలిన ఓ సిక్కు నేత.. కెనడాలో దారుణ హత్యకు గురయ్యారు. 75 ఏళ్ల రిపుదమన్ సింగ్ మాలిక్ను సర్రే ప్రాంతంలో కొందరు దుండగులు గురువారం టార్గెట్ చేసి మరీ చంపేసినట్లు కెనడా పోలీసులు వెల్లడించారు.
మాలిక్ తన కారులో వెళ్తుండగా అడ్డగించిన దుండగులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మాలిక్ అక్కడికక్కడే మృతిచెందాడు. తొలుత మృతుడిని పోలీసులు గుర్తించలేదు. ఆ తర్వాత మాలిక్ను హత్య చేసినట్లు అతడి కుమారుడు జస్ప్రీత్ మాలిక్ ఫేస్బుక్లో వెల్లడించారు. అయితే ఎయిరిండియా బాంబు పేలుళ్ల కేసులో తన తండ్రి నిర్దోషిగా తేలినప్పటికీ.. అతడిని నిందితుడిగానే చూస్తున్నారని జస్ప్రీత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత హత్యకు.. పేలుళ్ల ఘటనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే మాలిక్ హత్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడు ఓ వివాదాస్పద వ్యక్తి అని, పలువురితో వ్యక్తిగత కక్షలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాలిక్ కెనడాలో ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు. వాంకోవర్ కేంద్రంగా పనిచేసే ఖల్సా క్రెడిట్ యూనియన్కు అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ యూనియన్లో 16వేల మంది సభ్యులున్నారు. దీంతో పాటు సర్రే, వాంకోవర్ ప్రాంతంలో పలు స్కూళ్లను నిర్వహిస్తున్నారు.
1985లో ఎయిరిండియా పేలుళ్ల ఘటన కెనడా చరిత్రలోనే గాక, విమాన ప్రమాదాల్లోనే అత్యంత భీకరమైన ఉగ్ర ఘటన. ఆ ఏడాది జూన్ 23న 329 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఓ ఎయిరిండియా విమానం టొరొంటో నుంచి బాంబే(ఇప్పటి ముంబయి) బయల్దేరింది. మధ్యలో మాంట్రియల్ విమానాశ్రయంలో కాసేపు ఆగింది. అక్కడి నుంచి బయల్దేరి అట్లాంటిక్ సముద్రం మీద 31వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా విమానం కార్గోలో ఓ సూట్కేస్లో అమర్చిన బాంబు పేలి విమానం తునాతునకలైంది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తోన్న అందరూ మృతిచెందారు. మృతుల్లో 268 కెనడా పౌరులుండగా.. 24 మంది భారతీయులున్నారు.
1984లో స్వర్ణ దేవాలయంలో ఉగ్రవాదులున్నారన్న ఆరోపణలతో భారత ప్రభుత్వం సైన్యాన్ని పంపింది. ఈ ఘటనకు ప్రతీకారంగానే ఖలిస్థానీ అతివాదులు ఎయిరిండియా విమానాన్ని పేల్చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో ఇంద్రజీత్ సింగ్ రేయాత్ అనే వ్యక్తిని దోషిగా తేలగా.. మాలిక్, మరో వ్యక్తి సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా 2005లో నిర్దోషులుగా బయటపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.