అద్వితీయంగా అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం -2021
‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ సంస్థ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 3, 4వ తేదీలలో 24 గంటల పాటు అద్వితీయంగా ‘అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021’ కార్యక్రమం జరిగింది.
సింగపూర్: ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ సంస్థ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 3, 4వ తేదీలలో 24 గంటల పాటు అద్వితీయంగా ‘అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021’ కార్యక్రమం జరిగింది. ప్రపంచ నలుమూలల నుంచి 35 దేశాల్లోని 45 తెలుగు సంస్థలు, ప్రతినిధులు పాల్గొని ఒకే ప్రపంచ తెలుగు సాంస్కృతిక కుటుంబంగా కలసి, తెలుగు సంస్కృతికి నీరాజనాలు పట్టారు.
కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు జ్యోతి ప్రకాశనం చేసి అనుగ్రహభాషణాన్ని చేశారు. భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రారంభోపన్యాసం చేశారు. ‘ప్రపంచ నలుమూలల్లో వివిధ దేశాలలో తెలుగువారి ప్రతిభకు పట్టం కట్టే విధంగా, అన్ని దేశాల తెలుగు కళాకారులు ఒక కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయం అయ్యే విధంగా, ప్రపంచ వేదికను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం రూపొందించామని, అనూహ్యమైన స్పందనతో 35 దేశాల ప్రతినిధులు పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా అనిపించింది’ అని శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు, కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు సామవేదం షణ్ముఖ శర్మ, గరికిపాటి నరసింహారావులు సదస్సులో వారందరికీ తమ ఆశీస్సులు అందించారు. రాజకీయ, సినీ ప్రముఖులైన రామ్ మాధవ్, మురళీ మోహన్, మండలి బుద్ధ ప్రసాద్, వామరాజు సత్యమూర్తి, భువనచంద్ర, తనికెళ్ళ భరణి, సాయి కుమార్, హర్షవర్ధన్లతో పాటు, సురేఖ మూర్తి, పార్ధు నేమాని, విజయలక్ష్మి వంటి ప్రముఖ గాయనీ గాయకులు, ఎల్లా వెంకటేశ్వరరావు, మాండోలిన్ రాజేష్, తాళ్లూరి నాగరాజు తదితర సంగీత కళాకారులు సభను అలంకరించారు.
అమెరికా నుంచి చిట్టెన్ రాజు, తోటకూర ప్రసాద్, జయశేఖర్ తాళ్లూరి, నిరంజన్, మధు ప్రఖ్యా , భారత్ నుంచి డా.వంశీ రామరాజు. డా. మీగడ రామలింగస్వామి, రుద్రాభట్ల రామ్ కుమార్ పాల్గొన్నారు. సుమారు 200 మందికిపైగా కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని శాస్త్రీయ సంగీతం, నృత్యాలు, జానపదాలు, సినీ గీతాలు, వయోలిన్ వీణ వేణువు పియానో మొదలగు వాయిద్య గానాలు, అష్టావధానం, కవితలు, కథలు, వ్యాసాలు, లఘు నాటికలు మొదలైన ఎన్నో అద్భుత ప్రదర్శనలతో అందరిని అలరించారు. పోలెండ్ దేశస్థుడైన బాల గాయకుడు బుజ్జి చక్కటి తెలుగు పాటలతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
ఈ బృహత్కార్యక్రమానికి రాధిక మంగిపూడి ముఖ్య సమన్వయకర్తగా, ఊలపల్లి భాస్కర్ ప్రధాన సాంకేతిక నిర్వాహకునిగా, గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయిని ప్రత్యక్ష ప్రసార నిర్వాహకులుగా, చామిరాజు రామాంజనేయులు, జయ పీసపాటి, సుబ్బు పాలకుర్తి, సునీత, సీతారామరాజు ప్రధాన వ్యాఖ్యాతలుగా, గుంటూరు వెంకటేష్, సురేష్ చివుకుల, మౌక్తిక తదితరులు సాంకేతిక నిర్వాహక బృందంగా వ్యవహరించారు. ‘శుభోదయం’ సంస్థ, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ సింగపూర్, ఈ రెమిట్, EGA జూస్ ప్రధాన స్పాన్సర్స్గా వ్యవహరించిన ఈ కార్యక్రమం రెండు రోజులపాటు యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ కార్యక్రమం సుమారు 20 వేల మంది ప్రేక్షకులను ప్రపంచ వ్యాప్తంగా అలరించింది.
అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021లో పాల్గొంటున్న వివిధ దేశాల సంస్థలు.. సింగపూర్ నుంచి తెలుగు భాగవత ప్రచార సమితి, కాకతీయ కల్చరల్ సొసైటీ, మలేషియా తెలుగు సంఘం, హాంకాంగ్ తెలుగు సమాఖ్య, ఇండోనేషియా తెలుగు అసోసియేషన్ , తెలుగు అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ బ్రూనై... ఆస్ట్రేలియా నుంచి తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా, తెలుగుమల్లి , తెలుగు అసోసియేషన్ ఆఫ్ సిడ్నీ.. న్యూజిలాండ్ నుంచి తెలుగు అసోసియేషన్, సంగీత భారతి, భారతదేశం నుంచి వంశీ ఇంటర్నేషనల్ , రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, నవసాహితి ఇంటర్నేషనల్ , జనరంజని ముంబై, విశ్వనాథ ఫౌండేషన్.. సౌదీఅరేబియా నుంచి సౌదీ తెలుగు అసోసియేషన్.. ఖతార్ నుంచి ఖతార్ తెలుగు సమితి, ఆంధ్ర కళా వేదిక , బహ్రెయిన్ తెలుగు కళా సమితి , కువైట్ తెలుగు సంఘాల ఐక్యవేదిక , ఒమన్ తెలుగు కళా సమితి... యూఏఈ నుంచి తెలుగు తరంగిణి, మారిషస్ తెలుగు సాంస్కృతిక నిలయం సంస్థలు పాల్గొన్నాయి.
ఇంకా, దక్షిణాఫ్రికా నుంచి తెలుగు సాహిత్య వేదిక , సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ, ఆంధ్రప్రదేశ్ తెలుగు అసోసియేషన్ , తెలంగాణ అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ బోట్స్వానా.. నార్వే నుంచి వీధి అరుగు, నార్వే తెలుగు అసోసియేషన్.. యునైటెడ్ కింగ్డమ్ నుంచి తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ , స్వీడన్ తెలుగు కమ్యూనిటీ, ఫిన్లాండ్ తెలుగు అసోసియేషన్ , ఫ్రాన్స్ తెలుగు సంఘం, జర్మనీ కలోన్ తెలుగు వేదిక , నెదర్లాండ్స్ తెలుగు కమ్యూనిటీ , ఐర్లాండ్ తెలుగు సంఘం, డెన్మార్క్ తెలుగు సంఘం... కెనడా నుంచి ఆంటోరియో తెలుగు అసోసియేషన్, అటావా తెలుగు అసోసియేషన్, తెలుగు తల్లి మాసపత్రిక, అమెరికా నుంచి తానా, వంగూరి ఫౌండేషన్ IBAM సంస్థలు... పోలెండ్, స్విట్జర్లాండ్ , బెల్జియం, ఉగాండా, జపాన్ , శ్రీలంక దేశాలనుండి ప్రతినిధులు , కళాకారులు ఈ రెండు రోజుల కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలిసారి ఒకే అంతర్జాల వేదికపై 35 దేశాల తెలుగు ప్రతినిధులు ఇలా కలుసుకుని సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రసంగాలతో వేడుకలు జరుపుకోవడం ఒక విశిష్ట రికార్డుగా పరిగణించి ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ అధ్యక్షులు చింతపట్ల వెంకటాచారి ఈ కార్యక్రమాన్ని నమోదు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
మొదటిరోజు కార్యక్రమాలు..
రెండో రోజు కార్యక్రమాలు..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Gold: శంషాబాద్ ఎయిర్పోర్టులో 2 కిలోల బంగారం పట్టివేత
-
Sports News
WTC Final: ఐపీఎల్తో ఆత్మవిశ్వాసం వచ్చినా.. ఇది విభిన్నం: శుభ్మన్ గిల్
-
Politics News
Pattabhi: ఉద్యోగులకు మళ్లీ అన్యాయమే: పట్టాభి
-
India News
NIA: ఖలిస్థాన్ ‘టైగర్ ఫోర్స్’పై ఎన్ఐఏ దృష్టి.. 10 చోట్ల ఏకకాలంలో దాడులు
-
General News
TS Government: ₹లక్ష ప్రభుత్వ సాయం.. అప్లై చేసుకోండిలా..
-
World News
Imran Khan: ఇక పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు..!