ఉత్సాహంగా తాల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్.. ఫైనల్స్లో మెరిసిన ‘సూపర్స్టార్స్’
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో ‘శుభోదయం తాల్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) క్రికెట్ టోర్నమెంట్’ పోటీలు.....
లండన్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో ‘శుభోదయం తాల్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) క్రికెట్ టోర్నమెంట్’ విజయవంతంగా ముగిసింది. ఆగస్టు 21న (ఆదివారం) లండన్లోని ఓస్టర్లీలో ఇండియన్ జింఖానా క్లబ్లో ఉత్సాహంగా జరిగాయి. ఈ ఛాంపియన్షిప్లో మొత్తంగా 12 జట్లు పాల్గొనగా సూపర్స్టార్స్, వైజాగ్ బ్లూస్ జట్లు ఫైనల్స్కు చేరాయి. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో సూపర్స్టార్స్ జట్టు టీపీఎల్ -2022 విజేతగా నిలిచింది.
ఛాంపియన్షిప్లో విజేతల వివరాలు
టీపీఎల్-2022 ఛాంపియన్: సూపర్స్టార్స్ టీమ్, కెప్టెన్, ఫ్రాంచైజీ యజమాని- వేణుగోపాల్ కృష్ణ నవులూరి
తొలి రన్నరప్ జట్టు: వైజాగ్ బ్లూస్, కెప్టెన్- సందీప్ మూవ, ఫ్రాంచైజీ యజమాని- సుమన్ మూవ
రెండో రన్నరప్ జట్టు: యోధాస్, కెప్టెన్, ఫ్రాంచైజీ యజమాని- ఆనంద్ వేమూరి
మ్యాన్ ఆఫ్ ద సిరీస్: పవన్ కుమార్ చేశెట్టి (డీజే వారియర్స్)
ఉత్తమ బౌలర్: సాయి కుమార్ పూజారి ((డీజే వారియర్స్)
ఉత్తమ బ్యాట్స్మన్: చందు నూతలపాటి (సూపర్స్టార్స్)
రసవత్తరంగా సాగిన ఈ ఫైనల్స్ను వీక్షించేందుకు 150 మందికి పైగా తమ కుటుంబాలతో కలిసి తరలివచ్చారు. తొలుత భారత్, బ్రిటన్ జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన లండన్లోని బొరొఫ్ హౌన్స్లో మేయర్ రఘ్వీందర్ సిద్ధూ, హెస్టన్ వెస్ట్ కౌన్సిలర్ ఆడ్రియానా ఘెరోగె, ప్రత్యేక అతిథిగా న్యూలండన్ కళాశాలకు చెందిన విక్రమ్ పాల్గొని టోర్నీలో విజేతలు, ఇతరులను అభినందించి వారికి అవార్డులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా తాల్ కోశాధికారి అనిత నోముల మాట్లాడుతూ.. ఈ ఛాంపియన్షిప్ను ఎంతో విజయవంతంగా నిర్వహించిన టీపీఎల్ ఇన్ఛార్జి వాసుదేవ మే రెడ్డి, టీపీఎల్ కమిటీ సభ్యులు శరత్ పుట్టా, ముకేశ్ చక్రవర్తి తదితరులను అభినందించారు. దీన్ని సజావుగా నడిపించేందుకు వారంతా అవిశ్రాంతంగా కృషిచేశారన్నారు. వారి కృషిలేకపోతే ఇంత విజయవంతంగా జరిగేది కాదన్నారు. గత 14 ఏళ్లుగా తాల్ క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహిస్తూ యూకేలో ఉన్న తెలుగు కుటుంబాలను అనుసంధానం చేసేలా కృషిచేస్తోందని చెప్పారు. 2012లో ప్రీమియర్ లీగ్ మోడల్ను నిర్వహించి అతిపెద్ద టీ20 క్రికెట్ మ్యాచ్ని మొదలపెట్టినట్టు చెప్పారు. ఈ ఏడాది జరిగిన టోర్నమెంట్లో 12 జట్లు 16 వారాలపాటు ఆడాయని.. మొత్తంగా 47 మ్యాచ్లలో 240మంది క్రీడాకారులు తమ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారని తెలిపారు.
టీపీఎల్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న విజేతలు, రన్నరప్ జట్లు, టీపీఎల్ ఫ్రాంచైజీ యజమానులకు తాల్ ఛైర్మన్ భారతి కందుకూరి కృతజ్ఞతలు తెలిపారు. శుభోదయం టీపీఎల్-2022ని విజయవంతం చేసింనందుకు అభినందనలు తెలిపారు. టీపీఎల్ సలహాదారులు రవి సబ్బ, శరత్ జెట్టి, సంజయ్ భిరాజు, శ్రీధర్ సోమిశెట్టి, ఇతర వాలంటీర్లు.. ఈ టోర్నీ సజావుగా సాగేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాల్ ట్రస్టీలు, సలహాదారులు, వ్యవస్థాపక సభ్యులు, శాశ్వత సభ్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా