TANA: 23వ మహాసభలు.. ప్రముఖులకు అవార్డులు ప్రకటించిన తానా
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జూలై 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు.
ఫిలడెల్ఫియా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జూలై 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. మహాసభల నిర్వహణ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు తానా పలు అవార్డులను ప్రకటించింది.
కొవిడ్ మహమ్మారి నుంచి మానవాళికి రక్షణగా నిలిచిన ‘కొవాగ్జిన్’ టీకా సృష్టికర్తలు అయిన భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఆయన సతీమణి సుచిత్ర ఎల్ల దంపతులకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు తానా వెల్లడించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న నటుడు మురళీమోహన్కు తానా ఎన్టీఆర్ కల్చరల్ అవార్డును అందించనున్నారు. కళారంగంలో ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డును అందిస్తున్నట్లు తానా నిర్వాహకులు పేర్కొన్నారు.
అమెరికాలో స్థానిక తెలుగువారికి సేవలు అందిస్తోన్న శ్రీరంగనాథ బాబు గొర్రెపాటికి తానా ఫౌండేషన్ అవార్డును అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఘంటసాలకు చెందిన రంగనాథ బాబు.. అమెరికాకు వలస వచ్చిన తొలితరం ప్రవాస తెలుగువారిలో ఒకరు. తెలుగు భాషకు విశేష సేవలందించిన వారికి ఇచ్చే గిడుగు రామమూర్తి అవార్డును.. మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా. మన్నం వెంకటరాయుడికి ఇవ్వనున్నట్లు తానా ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: అమీర్పేటలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ
-
Apply Now: ‘సింగిల్ గర్ల్ చైల్డ్’కు సీబీఎస్ఈ స్కాలర్షిప్.. దరఖాస్తు చేశారా?
-
Hyderabad: పాతబస్తీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి గాయాలు
-
October 1: దేశవ్యాప్తంగా ‘శ్రమదాన్’.. స్వచ్ఛత కోసం మోదీ పిలుపు
-
Rakshit Shetty: తెలుగు ప్రేక్షకుల ఆదరణకు రక్షిత్ శెట్టి ఫిదా.. ఏమన్నారంటే?
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ