TANA : బోస్టన్ ‘తానా’ ఫౌండేషన్ 5కే రన్ విజయవంతం

తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి సారథ్యంలో బోస్టన్‌లో నిర్వహించిన 5కే రన్‌కు అనూహ్య స్పందన లభించింది. 200 మందికి పైగా పెద్దలు, 50 మందికి పైగా

Published : 26 Jun 2022 13:03 IST

తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి సారథ్యంలో బోస్టన్‌లో నిర్వహించిన 5కే రన్‌కు అనూహ్య స్పందన లభించింది. 200 మందికి పైగా పెద్దలు, 50 మందికి పైగా  చిన్నారులు ఎంతో  ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. తానా ఫౌండేషన్ దాతల సహకారంతో చేస్తోన్న ఎన్నో ప్రాజెక్టుల వివరాలను శశికాంత్ ఈ సందర్భంగా  వివరించారు.

ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు మోహన్ నన్నపనేని, నిర్వాణ హెల్త్ సీఈఓ రవి ఇకా, కోటేష్ కందుకూరి, రావు యలమంచిలి శ్రీనివాస్ కొల్లిపర, సిటీ కోఆర్డినేటర్ కె.పి. సోంపల్లి, ప్రశాంత్ కాట్రగడ్డ, సూర్య తేలప్రోలు, శ్రీనివాస్ ఎండూరి, గోపి నక్కలపూడితోపాటు స్థానిక తానా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని  తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, రవి సామినేని, సుమంత్ రామిశెట్టి, వీర లెనిన్ తుళ్లూరి సమన్యయ పరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని