ఖతార్లో ఘనంగా తెదేపా 40 వసంతాల వేడుకలు
తెదేపా 40వ ఆవిర్భావ వేడుకలో ఖతార్లో ఘనంగా జరిగాయి. ఎన్నారై తెదేపా- ఖతార్ కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో......
ఖతార్: తెదేపా 40వ ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా జరిగాయి. ఎన్నారై తెదేపా- ఖతార్ కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో ప్రవాసులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మరెడ్డి పట్టాభిరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఊహించని రీతిలో పార్టీ 40వ ఆవిర్భావ ఉత్సవాన్ని దిగ్విజయం చేసిన టీడీపీ ఖతార్ కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందించారు. గత పది రోజులుగా గల్ఫ్ దేశాల పర్యటనలో తాను వెళ్లిన ప్రతిచోటా ఆదరణ లభించిందన్నారు. వేదిక, సభాప్రాంగణం అలంకరణ చూసి ముగ్దులై అంతా పసుపుమయంగా ఉందని ప్రశంసించారు. ఏపీ పునర్నిర్మానః జరగాలన్నా.. పోలవరం, అమరావతి నిర్మాణం పూర్తి చేయాలన్నా, యువతకు ఉపాధి లభించాలన్నా ప్రతి కార్యకర్తా తన వంతు కృషిచేసి పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు పనిచేయాలన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు అధికారంలోకి రావడం అనివార్యమనీ.. పిల్లల బంగారు భవిష్యత్తు ఎంతో అవసరమన్నారు. వైకాపా అరాచకాలను ఎండగట్టారు. ఆయన ప్రసంగం టీడీపీ ఖతార్ కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఈ వేడుకల్ని విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించిన నరేష్ మద్దిపాటి, రవి పొనుగుమాటి, విక్రమ్ సుఖవాసి, గొట్టిపాటి రమణయ్య, సత్యనారాయణ మల్లిరెడ్డి, మేష్ దాసరి సహా ప్రతి సైనికుడికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గత పది రోజులుగా కార్యక్రమాలు విజయవంతం కావడంలో కీలక భూమిక పోషించిన ఎన్నారై టీడీపీ విభాగం సమన్వయకర్త రాజశేఖర్ చప్పిడి, కువైట్ టీడీపీ అధ్యక్షులు సుధాకర్ రావు కుదరవల్లికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమావేశానికి హాజరైన వారందరికీ నరేష్ మద్దిపాటి అభినందనలు తెలిపారు. తెలుగువారందరి పార్టీ టీడీపీ అన్నారు. 40 వసంతాల తెలుగుదేశం ప్రస్థానం గురించి రవి పొనుగుమాటి చక్కగా వివరించారు. పార్టీ ఎదుర్కొన్న సంక్షోభాలు, ఒడిదొడుకులు, సాధించిన అపూర్వ విజయాలు, అభివృద్ధి- సంక్షేమం గురించి వివరించారు. అలాగే, పార్టీ విజయంకోసం, చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చేందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని సత్యనారాయణ మల్లిరెడ్డి పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి కార్యకర్త ఎండగట్టాలని గొట్టిపాటి రమణయ్య సూచించారు. ప్రతి తెలుగుదేశం కార్యకర్త కార్యోన్ముఖులై ముందుకు సాగాలని శాంతయ్య యలమంచిలి కోరారు. ఈ సమావేశానికి విచ్చేసిన మహిళలు, చిన్నారులను జేవీ సత్యనారాయణ కొనియాడారు.
తెదేపా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు ప్రత్యేక ఆకర్షితులుగా నిలిచారు. పలువురు కార్యకర్తలు, తెదేపా అభిమానులు పట్టాభిరాంతో ఫొటోలు దిగి సందడి చేశారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకొని అయన అమెరికా బయలుదేరారు. ఈ కార్యక్రమానికి విక్రమ్ సుఖవాసి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రవి పొనుగుమాటి ముగింపు సందేశ ధన్యవాదాలతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు. -
కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విజ్ఞాన వికాసంపై తానా ప్రపంచ సాహిత్యవేదిక సదస్సు
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే అంశంపై సదస్సు విజ్ఞానదాయకంగా జరిగింది. -
ఘనంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) వెబ్సైట్ ఆవిష్కరణ
ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛమైన సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించిన క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ తన వెబ్సైట్ను www.qef.org ఆవిష్కరించింది. నాణ్యమైన సాంకేతిక ప్రయాణంలో దీన్నొక మైలురాయిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వక్తలు పేర్కొన్నారు. -
ఏపీని ఆదుకునే ఎన్నారైలపై ఇంత అక్కసా?: జయరాం కోమటి
రాష్ట్రానికి మేలు చేసేలా కృషిచేస్తున్న ఎన్నారైలపై వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడటం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు. -
ఎన్ఆర్ఐ తెదేపా, జనసేన ఆధ్వర్యంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు
ఎన్ఆర్ఐ తెదేపా కువైట్, జనసేన కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో తెదేపా 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్