యూరప్‌లోని 40 సిటీల్లో తెదేపా 40వ వార్షికోత్సవ వేడుకలు!

మార్చి 29కి ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించి 40 ఏళ్లు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో యూరప్‌లో తెదేపా ఆధ్వర్యంలో 40వ వార్షికోత్సవ వేడుకలు..

Updated : 20 Mar 2022 14:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మార్చి 29కి ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించి 40 ఏళ్లు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో యూరప్‌లో తెదేపా ఆధ్వర్యంలో 40వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఆ పార్టీ ఎన్నారై నేతలు సన్నాహాలు చేస్తున్నారు. యూరప్‌లోని 40కి పైగా నగరాల్లో ప్రవాసాంధ్రులు పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. తెదేపాకు చెందిన ఎన్నారై విభాగం సీనియర్‌ నేత జయకుమార్‌ గుంటుపల్లి ఆధ్వర్యంలో వేణు పోపూరి, ప్రసన్న నాదెండ్ల, ఎ.భాస్కర్‌, అనిల్‌, టిట్టు, శివ (జర్మనీ), మురళి రాపర్ల (ఐర్లాండ్‌) తదితర ప్రముఖుల సహకారంతో ఈ వేడుకలు జరపనున్నారు. ఎంతోకాలంగా తెదేపా యూరప్‌ విభాగానికి సేవలందిస్తున్న సీనియర్‌ నేతలను సన్మానించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

తెదేపా 40వ వార్షికోత్సవ వేడుకల కోసం nritdpeurope.com వెబ్‌సైట్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు జయకుమార్‌ తెలిపారు. యూరప్‌లోని ఎన్నారైలకు ఓ జ్ఞాపకంలా నిలిచిపోయేలా ఈ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. దీనిలో తెదేపా, నందమూరి కుటుంబ అభిమానులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని