యూకే, యూరప్లో ఘనంగా తెదేపా 40వ ఆవిర్భావ వేడుకలు
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలను యూకే, యూరప్ వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు.
డబ్లిన్లో తెదేపా ఆవిర్భావ వేడుకలు
ఇంటర్నెట్డెస్క్: తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలను యూకే, యూరప్ వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి కేకులు కోసి సంబరాలు జరుపుకున్నారు. ఎల్లలు దాటినా మూలాలు మర్చిపోము అని నిరూపిస్తూ.. 40 ఏళ్లే కాదు వందేళ్లు అయినా పార్టీపై ఇలానే అభిమానం చూపిస్తామని పేర్కొన్నారు. తమ ఆరాధ్య దైవం, అభిమాన నటుడు ఎన్టీఆర్ స్థాపించిన తెదేపా 40 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఎన్ఆర్ఐ తెదేపా యూరోప్ నాయకులు డా.కిషోర్ బాబు, నవీన్ సామ్రాట్ జలగడుగు, అమర్నాథ్ పొట్లూరి, శ్యామ్ సుందర్ రావు ఊట్ల, శ్రీనివాస్ గోగినేని తదితరులు పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి అంగరంగ వైభవంగా వేడుకలను జరిపారు. జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, జై చంద్రబాబు అంటూ వేదికలు మారుమోగేలా చేశారు. తెదేపాను గెలిపించేందుకు ఎంత కష్టమైన పడతామని ప్రతిజ్ఞ చేశారు. 2024లో చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు తమ శక్తి కొద్దీ కష్టపడతామని పేర్కొన్నారు.
లండన్- సుట్టన్లో..
ఇక యూకే, యూరప్లో పార్టీ 40వ వసంతోత్సవం వేడుకలను ఆయా దేశాల ఎన్నారై తెదేపా కౌన్సిల్ సభ్యులు ఘనంగా జరిపారు. డెన్మార్క్లో అమర్నాథ్, బ్రస్సెల్స్లో కొండయ్య, శివకృష్ణ, స్వీడన్లో ప్రవీణ్, నార్వేలో వేంకటపతి, నెధర్లాండ్స్లో వివేక్, ఇటలీలో సతీష్ కుమార్, వీరు, మాల్టాలో అనిల్ గుడిపూడి, దినేష్ పాకలపాటి, సుమంత్, వీరూ మేక, ఫిన్లాండ్లో రామకృష్ణ, పోర్చుగల్లో దశరథ్, ఇంగ్లాండ్లో నవీన్ సామ్రాట్, శ్యాంసుందర్ రావు, వెంకట రమణ, శ్రీనివాస్, డా.చంద్రశేఖర్, ఐర్లాండ్లో కృష్ణ ప్రసాద్, శివబాబు, భరత్, ప్రముఖ్, లాత్వియాలో మీరా కుమార్, పోలాండ్లో చందు తదితరులు తెదేపా ఆవిర్భావ వేడులకను నిర్వహించారు. ఈసందర్భంగా వేదికలను పసుపు పచ్చని తోరణాలతో అలంకరించి జెండాని ఆవిష్కరించారు. 2024లో తాము అభిమానిస్తున్న పార్టీని అధికారంలోకి తెచ్చే వరకు విశ్రమించమని పేర్కొన్నారు. ఎన్ఆర్ఐ తెదేపా యూరోప్ టీం సభ్యులు స్థానిక తెదేపా నాయకులతో కలిసి ఏపీ రాజధాని కోసం అహర్నిశలు కష్టపడిన రైతులకు అమరావతిలో సుమారు 700 మందికి పైగా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని నగరి, పూతలపట్టులలో అన్నదాన కార్యక్రమం చేశారు. పలు అనాథాశ్రమాల్లో ఒక్కరోజు అన్న వితరణ చేసి మాతృభూమి మీద, తమ అభిమాన పార్టీ మీద అభిమానాన్ని చాటుకున్నారు.
గాల్వేలో..
కోర్క్లో..
పోలాండ్లో..
మాంచెస్టర్లో..
ఈస్ట్ లండన్లో..
బెల్జియంలో..
కార్డిఫ్లో..
బర్మింగ్హామ్లో..
బ్లాక్పూల్లో..
హై వైకోంబ్లో..
కోవెన్ట్రీలో..
ఇటలీలో..
హై వైకోంబ్లో..
మాల్టాలో..
న్యూ క్యాస్టల్లో..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు. -
కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా