సౌదీ అరేబియాలో ఘనంగా తెదేపా ఆవిర్భావ వేడుకలు

సౌదీ అరేబియాలో తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సౌదీలోని కొబార్‌, జూబిలీ ప్రాంతాల్లో ఎన్‌ఆర్‌ఐలు తొలిసారిగా

Published : 30 Mar 2022 14:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సౌదీ అరేబియాలో తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సౌదీలోని కొబార్‌, జూబిలీ ప్రాంతాల్లో ఎన్‌ఆర్‌ఐలు తొలిసారిగా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూమ్‌ సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో ప్రవాసి తెదేపా కోఆర్డినేటర్‌ బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ మొదటిసారి సౌదీ అరేబియాలో తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెదేపా అధికారంలోకి వచ్చాక ప్రజలకోసం ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలు మేలు చేశాయన్నారు. తెదేపా నేత రావి రాధాకృష్ణ మాట్లాడుతూ ఏపీ ముందుకెళ్లాలంటే చంద్రబాబు విజన్‌ ఎంతో అవసరమని.. వచ్చే ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐలు తెదేపాకు అండగా ఉండి గెలిపించాల్సిన అవసరముందన్నారు. ఇప్పుడున్న పరిస్థితులను చంద్రబాబు మాత్రమే చక్కదిద్దగలరని చెప్పారు. ఈ సమావేశంలో ఎన్‌ఆర్‌ఐ తెదేపా నేతలు భర్ద్వాన్‌ మాదాల, మద్దకూరి చంద్రశేఖర్‌, నాగేశ్వరరావు బలుసు, అడబాల చిన్నా, నర్సింహ చిలుకు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు