కువైట్లో తెలుగువారి సంక్షేమాన్ని వైకాపా సర్కార్ గాలికొదిలేసింది: పట్టాభి
కువైట్లో నివసిస్తున్న సుమారు 4లక్షల మంది ప్రవాస తెలుగు పౌరుల సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసిందని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్.....
కువైట్లో ఘనంగా మహానాడు వేడుకలు
కువైట్: కువైట్లో నివసిస్తున్న సుమారు 4లక్షల మంది ప్రవాస తెలుగు పౌరుల సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసిందని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు తెదేపా కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర్ రావు నేతృత్వంలో జరిగిన మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ.. 2024లో తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు పార్టీ కేడర్ని ఇబ్బందులకు గురిచేస్తున్న వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పని ప్రారంభిస్తామని, చంద్రబాబు ప్రమాణ స్వీకారం వరకు ఆగబోమని చెప్పారు. ఏపీకి చెందిన సుమారు 4లక్షల మంది వివిధ వృత్తుల వారు కువైట్లోని వివిధ ప్రాంతాల్లో డ్రైవర్లు, హౌస్ మెయిడ్స్, హౌస్ కీపర్స్ తదితర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారనీ.. రాయలసీమ నుంచి వెళ్లిన వారు అత్యధిక సంఖ్యలో కువైట్ వెళ్లి బతుకుబండి లాగుతున్నారన్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏఆర్టీ విభాగం ఏర్పాటు చేసి ప్రవాస తెలుగుపౌరులకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేవారని గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక గత మూడేళ్లలో కువైట్లోని ప్రవాస తెలుగు ప్రజల సంక్షేమాన్ని, వారి సమస్యలను గాలికొదిలేసిందని పట్టాభి ఆరోపించారు.
అనంతరం తెదేపా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్ మాట్లాడుతూ.. అధికారంలో లేకపోయినప్పటికీ తెలుగుదేశం కువైట్ విభాగం ఇబ్బందుల్లో ఉన్న ప్రవాసులకు ఇతోధికంగా సాయం చేస్తూ భరోసా కల్పిస్తోందన్నారు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ అధికార పగ్గాలు చేపడుతుందని, కువైట్లో తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి కృషిచేస్తుందని తెలిపారు. జగన్ మోసపూరిత పథకాలు, వైఫల్యాలను వివరించిన కువైట్ తెదేపా నేత ఈశ్వర్ నాయుడు.. త్వరలోనే ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.
శుక్రవారం సాయంత్రం ఖైతాన్ ప్రాంతంలో ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన మహానాడుకు పలు ప్రాంతాల నుంచి భారీగా తెదేపా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన విగ్రహానికి నివాళులర్పించి, భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మహానాడులో పలు తీర్మానాలు ఆమోదించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ బలోపేతానికి తమవంతు సహకారం అందించాలని, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కువైట్లో పెద్దఎత్తున చేపట్టాలని తీర్మానించారు. వైకాపా గూండాల చేతిలో హతమైన కంచర్ల జల్లయ్యకు ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కువైట్ సీనియర్ నాయకులు షేక్ బాషా, బోయపాటి శ్రీనివాసులు, దుగ్గి శ్రీనివాసులు, వీసీ సుబ్బారెడ్డి, దుర్గాప్రసాద్, షేక్ చాన్ బాషా, పెంచల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM