కాన్సాస్లో ఉత్సాహంగా ‘నాట్స్ తెలుగమ్మాయి’ పోటీలు
అమెరికాలో కాన్సాస్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆధ్వర్యంలో "నాట్స్ తెలుగమ్మాయి" పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న బాలికలు, మహిళలు ఆట,పాటలతో సందడి చేశారు.
కాన్సాస్: అమెరికాలో కాన్సాస్లో ‘ఉత్తర అమెరికా తెలుగు సంఘం’ (నాట్స్) ఆధ్వర్యంలో "నాట్స్ తెలుగమ్మాయి" పోటీలు ఉత్సాహంగా జరిగాయి. వీటిల్లో పాల్గొన్న బాలికలు, మహిళలు ఆట,పాటలతో సందడి చేశారు. శాస్త్రీయ, జానపద నృత్యాలతో పాటు ఏకపాత్రాభినయం,టాలీవుడ్ పాటలకు డ్యాన్స్లతో అదరగొట్టారు. అలాగే అలనాటి మేటి తెలుగు సినీతారలు జమున, సూపర్ స్టార్ కృష్ణలను గుర్తు చేసుకుంటూ వారికి నివాళిగా ప్రదర్శించిన పలు నృత్యాలు అలరించాయి. 'విశ్వమోహన్ అమ్ముల' మహిళలకు సంబంధించిన పాత పాటలు ఆలపించి అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.
అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలకు, మహిళలకు తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను తెలియజేయడమే లక్ష్యంగా ‘నాట్స్ తెలుగమ్మాయి’ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తోంది. తెలుగు భాష, మన కట్టు,బొట్టు,తెలుగుతనం రేపటి తరానికి పరిచయం చేసేందుకు ఈ పోటీలు దోహదపడుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా "ముద్దుగుమ్మ(18 ఏళ్ల లోపు)", "కిన్నెరసాని (19+ సంవత్సరాలు)" "కావ్యనాయకి (19+ ఏళ్లు పైబడిన వివాహిత)" మహిళలకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ, సంస్కృతిపై అవగాహన,రూపకాలు,ఆటపాటలు, భగవద్గీత పఠనం వంటి అంశాలు ఉన్నాయి. ఈ పోటీల్లో విజేతలకు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కల్పించారు. న్యాయ నిర్ణేతలుగా చైతన్య రంగిని,రేణుక గుమ్మడిపూడి,రమాదేవి కీలక పాత్ర పోషించారు.
ఈ కార్యక్రమాన్ని ‘నాట్స్’ జాతీయ సమన్వయకర్త వెంకట్ మంత్రి, రవి గుమ్మడిపూడి, నాట్స్ కాన్సాస్ చాప్టర్ సమన్వయకర్త ప్రసాద్ ఇసుకపల్లి ఆధ్వర్యంలో దిగ్విజయంగా నిర్వహించారు. "నాట్స్ తెలుగమ్మాయి" పోటీల నిర్వహణకు ఈవెంట్ కో ఆర్డినేటర్గా పార్వతి చిల్లర వ్యవహరించారు. రవి ఆయాసల, వెన్నెల నీతిపూడిలు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. "నాట్స్ తెలుగమ్మాయి" పోటీలను విజయవంతం చేసేందుకు రాధికా మంత్రి, రమాదేవి పొట్టం, సాయిరాం గండ్రోతుల, వేణు రవికాంత్ గార, మదన్ సానీ, విజయ్ రంగిని, సూర్య కాగడం, వెంకట్ వల్లూరిపల్లి, సౌజన్య రావు, శ్రీనివాస్ అబ్బూరి, రిత్విక్ అమ్మిరెడ్డి, చైతలిక మంత్రి, చరణి రంగిని, రామ్ సంగేమ్, జావిద్ మహ్మద్ తదితరులు కృషిచేశారు. తెలుగమ్మాయి విజేతల్లో ‘చిట్టి చిలకమ్మ’ విభాగంలో అక్షర రేపల్లె, మీనాక్షి అయ్యల సోమయాజులు, రిత్వి మహంకాళి, లౌక్య జమిలి ఉన్నారు. నాట్స్ కాన్సాస్ ముద్దుగుమ్మ విభాగంలో క్రిష కరే, సాయి సాత్విక చాడ, సాయి స్వప్నిక చాడ, అక్షర బొగ్గవరపు విజేతలుగా నిలిచారు. మిసెస్ నాట్స్ కాన్సస్ కిన్నెరసాని విభాగంలో విజేతలుగా శ్రీనిథి రావు, మిసెస్ నాట్స్ కాన్సస్ కావ్యనాయకి విభాగంలో సోనాలిక పడాల, నీలిమ పుండ్ల, సౌమ్య గిరి నిలిచారు. ఈ కార్యక్రమానికి విరాళాలతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికీ నాట్స్ ఛైర్విమెన్ అరుణ గంటి, నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు) నూతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా