‘చిల్డ్రన్స్‌ క్లైమేట్‌ ప్రైజ్‌’ దక్కించుకున్న అమెరికాలోని తెలుగు బాలిక

కార్చిచ్చు సమస్యకు పరిష్కారం చూపుతూ.. అమెరికాలో స్థిరపడ్డ 15 ఏళ్ల తెలుగు బాలిక ముందుకొచ్చింది. ఏఐ టెక్నాలజీతో కార్చిచ్చును మందుగానే అంచనా వేయొచ్చంటూ......

Updated : 23 Nov 2022 11:38 IST

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చు ఓ పెద్ద సమస్యగా మారింది. ఈ ముప్పుతో లక్షలాది ఎకరాల్లోని అడవులు కాలి బూడిదవుతున్నాయి. వేలాది జంతువులు మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి అడవికి నిప్పంటుకుంటే దాన్ని ఆర్పేయడం ఎవరితరం కావడం లేదు. దీంతో ఆయా దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. కాగా ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ.. అమెరికాలో స్థిరపడ్డ 15 ఏళ్ల తెలుగు బాలిక ముందుకొచ్చింది. ఏఐ టెక్నాలజీతో కార్చిచ్చును మందుగానే అంచనా వేయొచ్చంటూ బాలిక రేష్మా కోసరాజు ఓ ప్రాజెక్టును రూపొందించింది. దాదాపు 90 శాతం కచ్చితత్వంతో కార్చిచ్చును ఇది అంచనా వేయగలదు. ఈ ప్రాజెక్టు 2021 ఏడాదికి గాను ఉత్తమ చిల్డ్రన్‌ క్లైమేట్‌ ప్రైజ్‌ను దక్కించుకుంది. రేష్మా కుటుంబం కొన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని