Joe Biden asleep: కాప్ సదస్సులో.. అమెరికా అధ్యక్షుడి కునుకు?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (78) మాత్రం కునుకు తీస్తున్నట్లు కనిపిస్తోన్న ఓ వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
వైరల్గా మారిన జో బైడెన్ వీడియో
గ్లాస్గో: వాతావరణ సంక్షోభానికి పరిష్కారాలు కనుగొనే లక్ష్యంతో ఒకే వేదికపైకి చేరిన ప్రపంచ దేశాలు.. అందుకు గల కార్యాచరణను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా సంపన్న దేశాలు ఎలాంటి హామీలు ఇస్తున్నాయనే విషయంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమయ్యింది. ఇలాంటి కీలక సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (78) మాత్రం కునుకు తీస్తున్నట్లు కనిపిస్తోన్న ఓ వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
గ్లాస్గో వేదికగా జరుగుతోన్న కాప్26 ఐరాస సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 120దేశాధినేతలు, అధ్యక్షులు పాల్గొన్నారు. ఒక్కో దేశం తాము చేపడుతోన్న కార్యక్రమాలు, చేయాల్సిన విషయాలపై అంతర్జాతీయ సమాజానికి వివరిస్తున్నాయి. ఈ సమయంలో ఆయా దేశాల ప్రతినిధుల ప్రసంగాలను వింటోన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మెల్లగా కునుకు తీస్తున్నట్లు ఉన్న ఓ వీడియో తాజాగా వైరల్గా మారింది. దాదాపు 20 సెకన్లపాటు అలా నిద్రలోకి జారుకున్నట్లు అందులో కనిపించింది. కొద్దిసేపటికి ఓ సహాయకుడు బైడెన్ దగ్గరికి వచ్చి పలుకరించడంతో తేరుకున్న ఆయన.. తిరిగి ప్రసంగాన్ని వినడం ప్రారంభించారు. అమెరికా వార్తాపత్రికకు చెందిన ఓ జర్నలిస్టు ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో తాజాగా అది వైరల్గా మారింది. షేర్ చేసిన కొన్ని గంటలకే 46లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు.
డొనాల్డ్ ట్రంప్ విమర్శలు..
ఈ నవంబర్ 20తో 79ఏళ్ల వయసులోకి అడుగుపెడుతోన్న జో బైడెన్.. అమెరికా అధ్యక్షుల్లో అతి ఎక్కువ వయసున్న వ్యక్తిగా నిలిచారు. అయితే, ఈ వయసులో అధ్యక్షుడిగా సమర్థంగా విధులు నిర్వర్తించలేరని ఆయనపై ప్రత్యర్థులు విమర్శలు కూడా చేస్తుంటారు. ముఖ్యంగా గత అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో బైడెన్ను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘స్లీపీ జో’గానే అభివర్ణించారు. తాజాగా కాప్26 సదస్సులోనూ నిద్రపోతున్నట్లు కనిపించిన వీడియోపై స్పందించిన ట్రంప్.. బైడెన్ తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు. యూరప్కు వెళ్లి ఓపక్క గ్లోబల్ వార్మింగ్ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని చెప్పిన బైడెన్.. మరోవైపు నిద్రలోకి జారుకున్నారు. ఓ విషయంపై అత్యంత శ్రద్ధ ఉన్నవారు అలా నిద్రపోరు అంటూ బైడెన్పై డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు.