Love Story: ‘లవ్‌స్టోరి’ క్రేజ్‌.. యూకేలోనూ విడుదల

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరి’ చిత్రానికి  విదేశాల్లోనూ మంచి క్రేజ్‌ ఏర్పడింది.

Published : 23 Sep 2021 16:05 IST

లండన్‌: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌స్టోరి’. ఈ ప్రేమకథని సెప్టెంబరు 24న తెలుగు రాష్ట్రాలతోపాటు యూకేలోనూ విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రం ప్రదర్శితమయ్యే అక్కడి థియేటర్ల వివరాల్ని పంచుకుంది. సుమారు రెండేళ్ల తర్వాత యూకేలో విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రమిదేనని తెలిపింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. పవన్‌ సి.హెచ్‌ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని