రైతుల ఆందోళన: ఆ కవి చెప్పింది నిజమే
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నెల రోజులకు పైగా రైతులు ఆందోళన చేస్తోన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత చిదంబరం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రభుత్వాన్ని హెచ్చరించిన కాంగ్రెస్ నేత
దిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నెల రోజులకు పైగా రైతులు ఆందోళన చేస్తోన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత చిదంబరం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాము మోసపోతున్నామని నమ్ముతున్న రైతుల కోపాన్ని ప్రభుత్వం తట్టుకోలేదని హెచ్చరించారు. ఈ క్రమంలో ఆయన సోమవారం ట్విటర్ వేదికగా తిరువళ్లువర్ బోధనలను ప్రస్తావించారు.
‘రైతులు చేతులు ముడుచుకొని కూర్చుంటే..జీవితాన్ని త్యజించిన వ్యక్తి కూడా మనుగడ సాగించలేడు. ఈ విషయాన్ని 2,000 వేల సంవత్సరాల క్రితం నా అభిమాన కవి తిరువళ్లువర్ తన రచనల్లో వెల్లడించారు. ఈ రోజు అది నిజమని తెలుస్తుంది. తాము మోసపోతున్నామని నమ్మిన రైతుల కోపాన్ని ఏ ప్రభుత్వమూ తట్టుకోలేదు’ అని చిదంబరం ట్వీట్ చేశారు.
కాగా, వ్యవసాయ చట్టాలపై కేంద్రం, రైతు సంఘాల మధ్య నెల రోజులకు పైగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ రోజు ఇరువర్గాల మధ్య ఏడో విడత చర్చలు జరుగుతున్నాయి. చట్టాల రద్దుతో పాటు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరకపోతే గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీ చేపడతామని, ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఇప్పటికే రైతన్నలు హెచ్చరించారు.
ఇవీ చదవండి:
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ