మూడేళ్లలో అమరులైన సైనికులు ఎందరంటే?

దేశ సరిహద్దుల్లో అనునిత్యం పహారా కాస్తూ శత్రు దాడుల్లో అమరులైన పారామిలిటరీ సిబ్బంది వివరాలను కేంద్రం వెల్లడించింది. గత మూడేళ్ల కాలంలో విధి నిర్వహణలో 4వేల మందికి పైగా............

Published : 15 Sep 2020 23:11 IST

లోక్‌సభకు వెల్లడించిన కేంద్రమంత్రి

దిల్లీ: దేశ సరిహద్దుల్లో అనునిత్యం పహారా కాస్తూ శత్రు దాడుల్లో అమరులైన పారామిలిటరీ సిబ్బంది వివరాలను కేంద్రం వెల్లడించింది. గత మూడేళ్ల కాలంలో విధి నిర్వహణలో 4వేల మందికి పైగా జవాన్లు మృతిచెందినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ఈ విషయాన్ని  లోక్‌సభలో వెల్లడించారు. 2017 నుంచి 2019 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా 4,132 మంది పారామిలటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆయన తెలిపారు. ఓ సభ్యుడు లిఖితపూర్వంగా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. మృతిచెందిన సైనికుల్లో గెజిటెడ్‌ అధికారులు, సబార్డినేట్‌ అధికారులు, ఇతర ర్యాంకుల సిబ్బంది ఉన్నట్టు తెలిపారు. మూడేళ్ల కాలంలో అమరులైన మొత్తం జవాన్లలో అత్యధికంగా సీఆర్‌పీఎఫ్‌కు చెందిన వారు 1597 మంది కాగా.. 725 మంది బీఎస్‌ఎఫ్‌, 671 మంది సీఐఎస్‌ఎఫ్, 429 మంది ఐటీబీపీ, 381 మంది ఎస్‌ఎస్‌బీ, 381 మంది అస్సాం రెఫిల్స్‌కు చెందిన వారు ఉన్నట్టు మంత్రి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని