మూడేళ్లలో అమరులైన సైనికులు ఎందరంటే?
దేశ సరిహద్దుల్లో అనునిత్యం పహారా కాస్తూ శత్రు దాడుల్లో అమరులైన పారామిలిటరీ సిబ్బంది వివరాలను కేంద్రం వెల్లడించింది. గత మూడేళ్ల కాలంలో విధి నిర్వహణలో 4వేల మందికి పైగా............
లోక్సభకు వెల్లడించిన కేంద్రమంత్రి
దిల్లీ: దేశ సరిహద్దుల్లో అనునిత్యం పహారా కాస్తూ శత్రు దాడుల్లో అమరులైన పారామిలిటరీ సిబ్బంది వివరాలను కేంద్రం వెల్లడించింది. గత మూడేళ్ల కాలంలో విధి నిర్వహణలో 4వేల మందికి పైగా జవాన్లు మృతిచెందినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ విషయాన్ని లోక్సభలో వెల్లడించారు. 2017 నుంచి 2019 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా 4,132 మంది పారామిలటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆయన తెలిపారు. ఓ సభ్యుడు లిఖితపూర్వంగా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. మృతిచెందిన సైనికుల్లో గెజిటెడ్ అధికారులు, సబార్డినేట్ అధికారులు, ఇతర ర్యాంకుల సిబ్బంది ఉన్నట్టు తెలిపారు. మూడేళ్ల కాలంలో అమరులైన మొత్తం జవాన్లలో అత్యధికంగా సీఆర్పీఎఫ్కు చెందిన వారు 1597 మంది కాగా.. 725 మంది బీఎస్ఎఫ్, 671 మంది సీఐఎస్ఎఫ్, 429 మంది ఐటీబీపీ, 381 మంది ఎస్ఎస్బీ, 381 మంది అస్సాం రెఫిల్స్కు చెందిన వారు ఉన్నట్టు మంత్రి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM