నితీశ్ కుమార్కు తేజస్వి మద్దతు
రాజకీయాలంటే ప్రత్యర్ధులు పరస్పరం దుమ్మెత్తి పోసుకోవటమే తప్ప సానుకూలంగా స్పందించే సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి.
ఏ విషయంలో అంటే..
పట్నా: రాజకీయాలంటే ప్రత్యర్ధులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటమే తప్ప.. సానుకూలంగా స్పందించే సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి. కాగా ఆ విధమైన సంఘటన ఒకటి బిహార్లో చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు నిరసనగా జరిగిన ఓ అనూహ్య ఘటనను ఆయన ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఖండించారు. వివరాలు ఇలాఉన్నాయి. ఇక్కడి మధుబని ప్రాంతంలో జరిగిన ఓ బహిరంగ సభలో.. ఉల్లిధరల పెరుగుదలకు నిరసనగా ఓ వ్యక్తి నితీశ్ కుమార్పై ఉల్లిపాయలు విసిరాడు. భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకోగా.. అతనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అతన్ని వెళ్లనివ్వాలని సూచించి హుందాగా వ్యవహరించారు.
కాగా, మహాకూటమి తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ ఈ సంఘటనను ఖండించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కారాదని.. ప్రజలు నిరసనను తెలిపేందుకు ప్రజాస్వామ్యయుతమైన అనేక విధానాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఓటింగు ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను తెలుపవచ్చని ఆయన సూచించారు. ఉల్లి ధరలు తదితర అంశాలపై తమ పార్టీ పోరాటం సాగిస్తుందమని తెలిపిన తేజస్వి.. ఈ వైఖరి తనకు సమ్మతం కాదన్నారు. మంగళవారం నాటి రెండో విడత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 53.1 శాతం ఓట్లు పోలయ్యాయి. కాగా, నవంబర్ 7 నాడు తుది విడత పోలింగ్ అనంతరం నవంబర్ 10న ఫలితాలు విడుదల కావచ్చని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు