బిహార్ బూస్ట్.. యూపీ, బెంగాల్లోనూ మజ్లిస్ పోటీ
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఐదు స్థానాల్లో గెలుపొందిన ఏఐఎంఐఎం మరిన్ని రాష్ట్రాల్లో పోటీకి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ........
హైదరాబాద్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఐదు స్థానాల్లో గెలుపొందిన ఎంఐఎం మరిన్ని రాష్ట్రాల్లో పోటీకి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్, 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బిహార్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఒంటరిగా పోటీ చేస్తారా? కూటమిగా పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు.. సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
బిహార్ ఎన్నికల్లో భాజపా వ్యతిరేక ఓటును చీల్చేందుకే మజ్లిస్ పోటీ చేసిందన్న ఆరోపణలను ఒవైసీ తోసిపుచ్చారు. తాను రాజకీయ పార్టీని నడుపుతున్నానని, దేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే అధికారం తనకు ఉందని తెలిపారు. అయినా పోటీ చేసే విషయంలో తాను ఎవరి అనుమతినైనా తీసుకోవాలా? అని ప్రశ్నించారు. బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం ఓట్లను చీల్చిందని పశ్చిమ బెంగాల్కు చెందిన కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ముస్లింల కోసం ఆయన సొంత నియోజకవర్గంలో ఏం చేశారని అధిర్ను ఎదురు ప్రశ్నించారు. బిహార్ ఎన్నికల్లో గ్రాండ్ డెమొక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్లో భాగంగా 20 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయగా.. ఐదు స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. ముఖ్యంగా ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి విజయావకాశాలను దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్