పోడియం ముందు చంద్రబాబు బైఠాయింపు
ఏపీ శాసనసభ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.అధికార పక్షం తీరును నిరసిస్తూ తెదేపా అధినేత, ప్రతిపక్ష
12 మంది తెదేపా సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్
అమరావతి: ఏపీ శాసనసభ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.అధికార పక్షం తీరును నిరసిస్తూ తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పీకర్ పోడియం ఎదుట నేలపైనే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. తుపాను పరిహారంపై జరిగిన చర్చలో తెదేపా సభ్యుడు నిమ్మల రామానాయుడు చేసిన ఆరోపణలపై సీఎం జగన్ సమాధానమిచ్చారు. దానిపై మాట్లాడేందుకు చంద్రబాబు యత్నించగా అధికార పక్ష సభ్యులు అడ్డుతగిలారు. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై మండిపడుతూ తెదేపా సభ్యులతో కలిసి స్పీకర్ పోడియం ముందు భైఠాయించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు కావాలనే పోడియం ఎదుట బైఠాయించారని.. రౌడీయిజం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై తెదేపా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సభలో తెదేపా ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన 12 మందిని సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారంటూ తెదేపా ఎమ్మెల్యేలు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, ఏలూరి సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని, గద్దె రామ్మోహన్, బెందాళం అశోక్, మంతెన రామరాజు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, వేగుళ్ల జోగేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరిలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఒకరోజు వారిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు స్పీకర్ ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.