పోడియం ముందు చంద్రబాబు బైఠాయింపు

ఏపీ శాసనసభ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.అధికార పక్షం తీరును నిరసిస్తూ తెదేపా అధినేత, ప్రతిపక్ష

Updated : 30 Nov 2020 17:27 IST

12 మంది తెదేపా సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్‌

అమరావతి: ఏపీ శాసనసభ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.అధికార పక్షం తీరును నిరసిస్తూ తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పీకర్‌ పోడియం ఎదుట నేలపైనే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. తుపాను పరిహారంపై జరిగిన చర్చలో తెదేపా సభ్యుడు నిమ్మల రామానాయుడు చేసిన ఆరోపణలపై సీఎం జగన్‌ సమాధానమిచ్చారు. దానిపై మాట్లాడేందుకు చంద్రబాబు యత్నించగా అధికార పక్ష సభ్యులు అడ్డుతగిలారు. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై మండిపడుతూ తెదేపా సభ్యులతో కలిసి స్పీకర్‌ పోడియం ముందు భైఠాయించారు. అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ చంద్రబాబు కావాలనే పోడియం ఎదుట బైఠాయించారని.. రౌడీయిజం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై తెదేపా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సభలో తెదేపా ఆందోళన కొనసాగించడంతో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన 12 మందిని సస్పెండ్‌ చేశారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారంటూ తెదేపా ఎమ్మెల్యేలు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, ఏలూరి సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని, గద్దె రామ్మోహన్‌, బెందాళం అశోక్‌, మంతెన రామరాజు, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, వేగుళ్ల జోగేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరిలను సభ నుంచి సస్పెండ్‌ చేశారు. ఒకరోజు వారిపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు స్పీకర్‌ ప్రకటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని