భాజపాపై మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు
హిందూ ఆలయాలపై తాను చేసిన వ్యాఖ్యలపై ఎవరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. తిరుమల డిక్లరేషన్ అంశంలో ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో
తిరుపతి: హిందూ ఆలయాలపై తాను చేసిన వ్యాఖ్యలపై ఎవరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. తిరుమల డిక్లరేషన్ అంశంలో ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేబినెట్ నుంచి తొలగించాలంటూ రాష్ట్ర భాజపా నేతలు చేసిన డిమాండ్పై మంత్రి స్పందించారు. సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చి సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకోవాలని భాజపా డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆ పార్టీపై మంత్రి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
‘‘పది మందిని వెంటబెట్టుకెళ్లి అమిత్షా, కిషన్రెడ్డిని తొలగించాలంటే తొలగిస్తారా? రాష్ట్రంలో గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన భాజపా మాటలు హాస్యాస్పదం. అత్యధిక ఓట్లు వచ్చిన జగన్కు సలహాలు ఇచ్చే స్థాయి భాజపాకు ఉందా? ప్రధాని మోదీని తన సతీమణిని తీసుకెళ్లి రామాలయంలో పూజలు చేయమనండి. మోదీ, యూపీ సీఎం మాత్రం ఒంటరిగా ఆలయాలకు వెళ్తారు.. జగన్ మాత్రం కుటుంబసమేతంగా ఆలయానికి రావాలా? ఎవరి పార్టీ విధానాలు వారికి ఉంటాయి. సోము వీర్రాజు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక ఆలయాలపై దాడులు జరిగాయంటే ఆయన్ను తొలగిస్తారా? నోటా కంటే ఎక్కువ ఓట్లు ఎలా తెచ్చుకోవాలనే దానిపై భాజపా ఆలోచించుకోవాలి. అంతేకానీ మా పార్టీలో ఎవరిని ఉంచాలి.. ఎవరిని తీసేయాలనే విషయాలను జగన్కు భాజపా నేతలు చెప్పేదేంటి? ఎవరి పార్టీ వ్యవహారాలు వాళ్లు చూసుకుంటే మంచిది’’ అంటూ కొడాలి నాని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ