అలాగైతే పంజాబ్ అగ్నిగుండమే:అమరీందర్
సట్లేజ్ - యమునా లింక్ కెనాల్ నిర్మాణం పూర్తయితే పంజాబ్ అగ్నిగుండంలా మండుతుందని ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమ్రీందర్ సింగ్ హెచ్చరించారు. హరియాణాతో నీటి పంపకంపై ఒత్తిడి తెస్తే ఇదో జాతీయ భద్రతా.........
దిల్లీ: సట్లేజ్ - యమునా లింక్ కెనాల్ నిర్మాణం పూర్తయితే పంజాబ్ అగ్నిగుండంలా మండుతుందని ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ హెచ్చరించారు. హరియాణాతో నీటి పంపకంపై ఒత్తిడి తెస్తే ఇదో జాతీయ భద్రతా సమస్యగా మారుతుందని వ్యాఖ్యానించారు. మంగళవారం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, హరియాణా సీఎం మనోహర్లాల్ ఖట్టర్తో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కెనాల్ నిర్మిస్తే ప్రజల్లో భావావేశాలు ప్రబలి జాతీయ భద్రతకు ఆటంకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సమావేశం అనంతరం హరియాణా సీఎం ఖట్టర్ మాట్లాడుతూ.. మరోసారి అమరీందర్ సింగ్తో ఈ సమస్యపై సమావేశం కానున్నట్టు తెలిపారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యకు సామరస్యపూర్వకమైన పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నానన్నారు. లింక్ కెనాల్ నిర్మాణం పూర్తికావాలన్న వైఖరికే తాము కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు కూడా అదే విషయం చెప్పిందని తెలిపారు. ఈ అంశంపై ఇరు రాష్ట్రాల సీఎంలు చండీగఢ్లో సమావేశమై చర్చలు జరుపుతారని, అయితే దీనికి తేదీని త్వరలోనే నిర్ణయించనున్నట్టు చెప్పారు.
1966లో పంజాబ్, హరియాణా రాష్ట్రాల ఏర్పాటు తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య జలాల పంపకంపై నెలకొన్న వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. హరియాణా తమకు ఎక్కువ వాటా కావాలని అడుగుతుండగా.. అందుకు పంజాబ్ ససేమిరా అంటోంది. తమకు ఎలాంటి మిగులు జలాలు లేవని చెబుతోంది. ఈ క్రమంలోనే 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చి జలాలను ఇరు రాష్ట్రాల మధ్య విభజించి, పంచుకొనేందుకు వీలుగా కెనాల్ ఏర్పాటుకు నాందిపలికింది. 1982లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ కెనాల్ నిర్మాణం చేపట్టగా.. దీనిపై శిరోమణీ అకాళీ దళ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన జ్వాల చెలరేగింది.
ఇలా దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ఇరు రాష్ట్రాలకు మధ్యవర్తిత్వం వహించాలని జులై 28న సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. ఇందులో భాగంగా మంగళవారం కేంద్ర మంత్రి ఇరు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. హరియాణా, రాజస్థాన్లతో నీటి పంపకం విషయంలో పంజాబ్ విముఖత ప్రదర్శించింది. ఈ సందర్భంగా అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఈ లింక్ కెనాల్ నిర్మాణం పూర్తి చేయాలని మీరు నిర్ణయిస్తే పంజాబ్ అగ్నిగుండమవుతుంది. ఇదో జాతీయ సమస్యగా మారుతుంది. ఈ ప్రభావంతో హరియాణా, రాజస్థాన్ ప్రజలు కూడా ఇబ్బంది పడతారు’’ అని కేంద్రాన్ని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
22 నుంచి కేసీఆర్ బస్సుయాత్ర
భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే బస్సు యాత్రకు అనుమతి కోరుతూ భారాస అధికార ప్రతినిధి కేతిరెడ్డి వాసుదేవరెడ్డి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) వికాస్రాజ్కు వినతిపత్రం సమర్పించారు. -
రెండో రోజు 57 నామినేషన్లు
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు రెండో రోజైన శుక్రవారం 57 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రెండు రోజుల్లో కలిపి దాఖలైన నామినేషన్ల సంఖ్య 99కి చేరింది. -
దిల్లీ కాంగ్రెస్.. గల్లీ కాంగ్రెస్ వేర్వేరు
దిల్లీ కాంగ్రెస్, గల్లీ కాంగ్రెస్ వేరువేరని.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భాజపాకు ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
ఎన్నికల తర్వాత రుణమాఫీ అంటే నమ్మేదెవరు?
ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల వడ్లకు రూ.14 వేల బోనస్ ఇవ్వాలని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
భాజపా, కాంగ్రెస్లకు ఓట్లు అడిగే హక్కు లేదు
త లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని భాజపా, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని కాంగ్రెస్లకు ఇప్పుడు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. -
ఎన్నికల నిబంధనల ఉల్లంఘన.. ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యేలపై కేసుల నమోదు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు ఓ ఎంపీ అభ్యర్థిపై కేసులు నమోదయ్యాయి. -
కలిసి పనిచేయడానికి అంగీకారం
పార్లమెంటు ఎన్నికల్లో సీపీఎం, కాంగ్రెస్ కలిసి పనిచేయాలనే అంగీకారానికి వచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. -
భాజపా ఓటమే సీపీఎం లక్ష్యం: బీవీ రాఘవులు
మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మారుస్తామంటున్న భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. -
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్: కేటీఆర్
అన్నివర్గాల ప్రజలకు, యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కపటనీతికి మారు పేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. -
కాంగ్రెస్లోకి మరో భారాస ఎమ్మెల్యే!
మరో భారాస ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి రాజకీయ పార్టీల మధ్య ఒకవైపు వాదోపవాదాలు జరుగుతుండగా, మరోవైపు రాజేంద్రనగర్ భారాస ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సంక్షిప్త వార్తలు
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్తో యుగతులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం