నా ఫొటోతో భాజపా ఓట్లు అడుగుతోంది: అసద్
ఎన్నికలొస్తేనే భాజపాకు రోహింగ్యాలు.. పాకిస్థాన్ గుర్తుకొస్తాయని ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. పాతబస్తీ పరిధిలోని...
హైదరాబాద్: ఎన్నికలొస్తేనే భాజపాకు రోహింగ్యాలు.. పాకిస్థాన్ గుర్తుస్తాయని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. భోలక్పూర్లో అసదుద్దీన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆరున్నరేళ్లుగా కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉందని.. పాతబస్తీలో పాకిస్థానీలు, రోహింగ్యాలు ఉంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉంటే పట్టించుకోని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ హైదరాబాద్ వస్తున్న కేంద్ర మంత్రులు వరదల సమయంలో ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వరద బాధితులకు కేంద్రం ఒక్కపైసా సాయం చేయలేదని దుయ్యబట్టారు. హైదరాబాద్లో గొడవలు పెట్టాలని భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భాజపా, మోదీ ఫొటోతో కాకుండా తన ఫొటోతో ఓట్లు అడుగుతోందని వ్యాఖ్యానించారు. చైనాకు వ్యతిరేకంగా సర్జికల్ స్ట్రైక్ చేసే ధైర్యం భాజపాకు లేదని.. అలా చేస్తే తప్పకుండా కేంద్రాన్ని ప్రశంసిస్తామని అసదుద్దీన్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం