‘దుబ్బాక తరహా విజయం అందించండి’

సీఎం కేసీఆర్‌ పుట్టిన గడ్డపై కాషాయ జెండా ఎగురుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. సిద్దిపేట గడ్డమీద పోలీసులు బెదిరించినా భాజపా కార్యకర్తలు అండగా ఉన్నారని చెప్పారు.

Updated : 19 Nov 2020 19:16 IST

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ పుట్టిన గడ్డపై కాషాయ జెండా ఎగురుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. సిద్దిపేట గడ్డమీద పోలీసులు బెదిరించినా భాజపా కార్యకర్తలు అండగా ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యేగా  ప్రమాణస్వీకారం చేసిన అనంతరం భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్‌రావు మాట్లాడారు. ఉపఎన్నిక సమయంలో  హైదరాబాద్, రాచకొండ, సిద్దిపేట పోలీస్‌ కమిషనర్లు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని.. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని  ఆరోపించారు. పోలీసు అధికారులు చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే శిక్ష తప్పదన్నారు. దుబ్బాకలో తనకెలాంటి అవకాశం ఇచ్చారో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో అలాంటి విజయం అందించాలని రఘునందన్‌ కోరారు. దుబ్బాక ఎన్నికల్లో గెలిపించి శాసనసభకు పంపించిన దుబ్బాక ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని