ఎంపీగా తొలి ఏడాది గంభీర్ ‘రిపోర్ట్ కార్డ్’
భాజపా తరఫున లోక్సభ సభ్యుడిగా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఎన్నికై మే నాటికి ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా ఎంపీగా తన తూర్పు దిల్లీ నియోజకవర్గ ప్రజల కోసం సంవత్సరంలో...
విడుదల చేసిన భాజపా ఎంపీ, మాజీ క్రికెటర్
దిల్లీ: భాజపా తరఫున లోక్సభ సభ్యుడిగా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఎన్నికై మే నాటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఎంపీగా తన తూర్పు దిల్లీ నియోజకవర్గ ప్రజల కోసం సంవత్సరంలో చేసిన పనుల ‘రిపోర్ట్ కార్డ్’ను గంభీర్ విడుదల చేశారు. స్మాగ్ టవర్ ఏర్పాటుతోపాటు ఘాజీపూర్ వద్ద భూమి ఎత్తును తగ్గించడం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను అందులో ఉటంకించారు. ప్రజల కోసం తాను చేసిన అభివృద్ధి పనుల గురించి వారికి తెలియజేయడం తన బాధ్యతగా గంభీర్ పేర్కొన్నారు.
గౌతం గంభీర్ ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి తన జీతభత్యాలను ప్రజల కోసం ఖర్చు చేస్తూనే ఉన్నారు. పార్కులు, శ్మశాన వాటికలు, విశ్రాంతి గదులను కొత్తగా నిర్మించేందుకు, ఉన్నవాటిని బాగు చేయించేందుకు పూర్తి వేతనాన్ని వెచ్చించేవారని ఎంపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. లాక్డౌన్ సందర్భంగా ఐదు లక్షల ఆహార పొట్లాలు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా 2 లక్షల ఆహార ప్యాకెట్లు, 40 వేల వరకు మాస్కులు, ఫేస్షీల్డులు, ఐదు వేల పీపీఈ కిట్లను పంపిణీ చేసినట్లు పేర్కొంది. తూర్పు దిల్లీ నియోజకవర్గంలోని పలు చోట్ల చేతులను శుభ్రం చేసుకునేందుకు 12 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రిపోర్ట్ కార్డులో గంభీర్ వెల్లడించారు. 2019 సాధారణ ఎన్నికల్లో భాజపా తరఫున తూర్పు దిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గౌతం గంభీర్ దాదాపు 50 శాతం ఓట్లను సాధించడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM