ఆ ఓట్లతోనే ఎన్డీయే 15సీట్లు గెలుచుకోగలిగింది!
బిహార్ పీఠంపై నీతీశ్ కుమార్ కూర్చున్నా.. ప్రజల హృదయాల్లో మాత్రం తామే ఉంటామని ఆర్జేడీ నేత, మహా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని, సీఎం .........
అక్కడ పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలని తేజస్వీ డిమాండ్
పట్నా: బిహార్ పీఠంపై నీతీశ్ కుమార్ కూర్చున్నా.. ప్రజల హృదయాల్లో మాత్రం తామే ఉంటామని ఆర్జేడీ నేత, మహా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ అన్నారు. గురువారం ఆయన మహాకూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన సందర్భంగా మాట్లాడారు. ప్రజా తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని, సీఎం కుర్చీలో ఎవరు కూర్చున్నా తానే విజేతనన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, నీతీశ్ కుమార్ ఈ ఎన్నికల్లో ధన బలం, కండబలంతో పాటు అనేక ఎత్తుగడలు వేసినా 31 ఏళ్ల యువకుడినైన తనను ఆపలేకపోయారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్జేడీనే అతి పెద్ద పార్టీగా అవతరించడాన్ని ఆపలేరన్నారు. ‘నీతీశ్ జనాకర్షణ ఎక్కడికి పోయిందో చూడండి. ఆయన మూడో స్థానానికి పరిమితమయ్యారు. మార్పునకు ఇదో తీర్పు. నీతీశ్ కుమార్ సీఎం కుర్చీపై కూర్చున్నా.. ప్రజల హృదయాల్లో మాత్రం మనమే ఉంటాం’’ అని అన్నారు.
ఎన్డీయే-మహాకూటమికి ఓట్ల తేడా 12,720 మాత్రమే
ఎన్డీయేకి, తమకు మధ్య ఓట్ల తేడా కేవలం 12,720 మాత్రమేనని తేజస్వీ వివరించారు. ఆ ఓట్లతోనే 15 సీట్లను ఎన్డీయే గెలుచుకోగలిగిందన్నారు. చాలా తక్కువ ఓట్ల తేడాతోనే 20సీట్లు తాము ఓడిపోయామన్నారు. అనేక పోలింగ్ కేంద్రాల్లో 900 పోస్టల్ ఓట్లను చెల్లనివిగా రద్దుచేశారని, ఇంత భారీ సంఖ్యలో ఆ ఓట్లను ఎవరి ఒత్తిడికి తలొగ్గి రద్దు చేశారని ప్రశ్నించారు. అలా రద్దుచేసినచోట తిరిగి రీకౌంటింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. కండబలం, ధనబలంతోనే ఎన్డీయే గెలిచిందన్నారు. ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన నీతీశ్ కుమార్ తన ఆత్మప్రబోధానుసారం సీఎం పీఠానికి దూరంగా ఉంటారా? అని ప్రశ్నించారు.
నీతీశ్ దొడ్డిదారిన సీఎం అవ్వాలనుకుంటున్నారు
తమకు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల మద్దతు తమకే వున్నా.. అధికారం చేపట్టలేకపోయామన్నారు. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదని, 2015లో కూడా మహా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ భాజపా దొడ్డిదారిన వచ్చి అధికారాన్ని కైవసం చేసుకుందని దుయ్యబట్టారు. తమ అభ్యర్థులు 20 చోట్ల స్వల్ప వ్యవధితోనే ఓడిపోయారని, పోస్టల్ బ్యాలెట్లను రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా మద్దతు పొందలేకపోయిన నీతీశ్ దొడ్డిదారిన సీఎం అవ్వాలనుకుంటున్నారని విమర్శించారు. పోస్టల్ బ్యాలెట్లను ముందుగా ఎందుకు లెక్కించలేదని అధికారులను ప్రశ్నించారు. చాలా చోట్ల అవి చెల్లవని కూడా ప్రకటించారన్నారు. అనేక నియోజకవర్గాల్లో 900 కంటే ఎక్కువ పోస్టల్ బ్యాలెట్లను చెల్లనివిగా ప్రకటించడంపై సందేహం వ్యక్తంచేశారు.
బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. మొత్తం 243 స్థానాలకు ఆర్జేడీ 75 స్థానాలు గెలుచుకొని అతి పెద్ద పార్టీగా అవతరించగా.. భాజపాకు 74 స్థానాలు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ (122) కాగా.. ఎన్డీయే కూటమి (భాజపా- జేడీయూ-హెచ్ఏఎమ్-వీఐపీ) 125 స్థానాలు గెలుచుకుంది. నీతీశ్ కుమార్కు చెందిన జేడీయూ 43 స్థానాలతో మూడో స్థానానికే పరిమితమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. -
పవన్కల్యాణ్తో నాయకుల సమావేశం
ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్తో భేటీ అయ్యారు. -
తెలిసే.. వదిలేశారా?
అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు
ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. -
కేసుల్లోనూ నంబర్ వన్ ముఖ్యమంత్రి జగనే
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్రెడ్డి ఎద్దేవా చేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోరం..
అనంతపురం జిల్లా శింగనమల మండల వైకాపా మాజీ కన్వీనర్, అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే
రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది. -
క్యాష్ కొట్టు.. బస్సులు పట్టు
ఇటీవల వైకాపా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు 8,700 ఆర్టీసీ బస్సులు తీసుకున్నారు. వీటికి ఆ పార్టీ దాదాపు రూ.20 కోట్ల వరకు చెల్లించింది. -
భాజపా లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జుల నియామకం
రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తున్న లోక్సభ స్థానాలకు సీనియర్ నేతలను ఇన్ఛార్జులుగా ఆ పార్టీ నియమించింది. వీరిలో నలుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. -
డబ్బు తరలించడానికే ఆ కంటెయినర్
అయిదేళ్లుగా అడ్డదారిన ఆర్జించిన రూ.వేల కోట్ల సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్లో తరలించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా అభ్యర్థులకు పంచడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. -
తొలిదశకు ముగిసిన నామినేషన్లు
లోక్సభ ఎన్నికల తొలిదశకు నామినేషన్ల గడువు బుధవారం ముగిసింది. ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
టీఎంసీ దోచుకున్న సొమ్ము పేదలకే
పశ్చిమబెంగాల్లో పేదల నుంచి కొందరు దోచుకున్న రూ.3,000 కోట్లు తిరిగి బడుగులకే దక్కేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు