ముఖ్యమంత్రే కంగనకు పరిహారం ఇవ్వాలి: భాజపా

కక్ష సాధించేందుకే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బంగ్లాను కూల్చివేశారంటూ బాంబే హై కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ శుక్రవారం భాజపా మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది.

Published : 27 Nov 2020 21:09 IST

ముంబయి: కక్ష సాధింపులో భాగంగానే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బంగ్లాను కూల్చివేశారంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ భాజపా మహారాష్ట్ర సర్కార్‌పై విమర్శలకు దిగింది. ‘కంగన ఇంటిని కూల్చివేయడం దరుద్దేశపూరితంగా జరిగింది. ఆమెకు చెల్లించాల్సిన పరిహారం గురించి కోర్టు వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు తగ్గట్టుగా బీఎంసీ నడుచుకుంది. ఈ సమస్యకు రాష్ట్ర ముఖ్యమంత్రి నైతిక బాధ్యత తీసుకోవాలి. ఆమెకు, బీఎంసీ న్యాయవాదులకు చెల్లించే సొమ్మును మొత్తం ముఖ్యమంత్రే చెల్లించాలి. ఆ సొమ్ము ప్రజలది కాకూడదు’ అంటూ భాజపా నేత అతుల్‌ భత్కాల్కర్ వ్యాఖ్యానించారు.  

కాగా, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి నేపథ్యంలో కంగనా రనౌత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య ముదిరిన మాటల వివాదం..ఆమె బంగ్లా కూల్చివేతకు దారితీసిన విషయం తెలిసిందే. బీఎంసీ చర్యను ఖండిస్తూ ఆమె కోర్టును ఆశ్రయించగా.. నేడు కంగనకు అనుకూలంగా తీర్పు వెలువడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని