బిహార్‌ ఉప ముఖ్యమంత్రికి కరోనా!

బిహార్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌కు కూడా కరోనా వైరస్‌ నిర్ధారణ అయ్యింది. 

Published : 23 Oct 2020 01:52 IST

పట్నా: బిహార్‌ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ, అక్కడ వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే బిహార్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ కూడా వైరస్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే, ప్రస్తుతం శరీరంలోని అన్ని కీలక వ్యవస్థలు సక్రమంగానే పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. తొలుత స్వల్ప జ్వరం ప్రారంభమైందని అయితే, గడిచిన రెండు రోజులుగా శరీర ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పులు లేవని తెలిపారు. సీటీ స్కాన్‌ రిపోర్టు కూడా సాధారణంగానే ఉందని సుశీల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం పట్నాలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సుశీల్ మోదీ,‌ మరికొన్ని రోజుల్లోనే కోలుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాననే ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని