ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ భేటీ

తెరాస ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన అంశాలపై సీఎం వారితో సమీక్షించారు. ప్రభుత్వపరంగా ప్రజలకు చెప్పాల్సిన విషయాలు....

Published : 27 Aug 2020 00:42 IST

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన అంశాలపై సీఎం వారితో సమీక్షించారు. ప్రభుత్వపరంగా ప్రజలకు చెప్పాల్సిన విషయాలు అసెంబ్లీ వేదికగా వివరించాలని సమావేశంలో ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక ప్రజాపయోగ కార్యక్రమాలపై విస్తృత చర్చ జరగాలన్నారు. 

అనంతరం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సహా పలువురు అధికారులతో వివిధ అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే సెర్చ్‌ కమిటీల నియామకం పూర్తయిందని.. వీసీల ఎంపికకు సంబంధించిన కసరత్తు జరుగుతోందన్నారు. కరోనా కారణంగా నియామకాల్లో జాప్యం జరిగిందని చెప్పారు. ఇకపై ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీసీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని.. దీన్ని సీఎస్‌ స్వయంగా పర్యవేక్షించాలని కేసీఆర్‌ ఆదేశించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని