ఇది అంతం కాదు..ఆరంభం మాత్రమే: కేసీఆర్
పేదలను కాపాడటంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆర్వోఎఫ్ఆర్ (రిజర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) భూములను పరిరక్షిస్తామని చెప్పారు.
సాధ్యమైనంత త్వరగా సమగ్ర భూసర్వే
నూతన రెవెన్యూ బిల్లుపై చర్చలో సీఎం
హైదరాబాద్: పేదలను కాపాడటంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆర్వోఎఫ్ఆర్ (రిజర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) భూములను పరిరక్షిస్తామని చెప్పారు. ఇప్పటికే పట్టాలు పొందిన గిరిజనుల జోలికి వెళ్లబోమని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల్లో ఆర్వోఎఫ్ఆర్ కింద ఇచ్చిన పత్రాలు పట్టా సర్టిఫికెట్లు కావని.. ప్రజలు ఆ భ్రమల్లో ఉండొద్దన్నారు. నూతన రెవెన్యూ బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. బిల్లుపై ఇతర సభ్యులు ఇచ్చిన సభ్యులను స్వీకరిస్తామని చెప్పారు. రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగన్నారు. ఈ కొత్త చట్టం అంతం కాదని.. ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలపై ప్రధానంగా ఈ బిల్లులో దృష్టి సారించామన్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో ప్రజలు సంబురాలు చేసుకున్నారని సీఎం చెప్పారు. సాధ్యమైనంత త్వరగా రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్గా ధరిణి పోర్టల్ను రూపొందించామన్నారు. ధరణి పోర్టల్లో అటవీ భూములకు ప్రత్యేక కాలమ్ కేటాయించామన్నారు. ఈ పోర్టల్ను రెవెన్యూ శాఖే నిర్వహిస్తుందని తెలిపారు.
రెండు రకాలుగా పాస్బుక్ల వర్గీకరణ
వ్యవసాయ భూమికి ఆకు పచ్చ, వ్యవసాయేతర భూమికి ముదురు ఎరుపు రంగు పాస్బుక్ పంపిణీ చేస్తామని కేసీఆర్ చెప్పారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సూచన మేరకు ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతర రైతులకూ రైతుబంధు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కొత్త రెవెన్యూ బిల్లు ప్రకారం ఏ అధికారికీ విచక్షణాధికారాలు ఉండవన్నారు. ఎవరైనా తప్పు చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఏ రకమైన రిజిస్ట్రేషన్కి అయినా వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ తప్పనిసరి అని చెప్పారు.
పంపిణీకి ప్రభుత్వ భూమి లేదు
రాష్ట్రంలోని 87వేల ఎకరాల దేవాదాయ భూములు, 55వేల ఎకరాల వక్ఫ్ భూములు ఆక్రమణల్లో ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. వక్ఫ్, దేవాదాయ భూములను రక్షిస్తామన్నారు. రేపటి నుంచి వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్లు నిషేధిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతో పాటు గ్రామపంచాయతీ, పురపాలికల్లో అనుమతులను నిలివేస్తున్నట్లు స్పష్టం చేశారు. భూములు పంపిణీ చేస్తామని అసత్యాలు చెప్పబోమని.. రాష్ట్రంలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వ భూమే లేదని సీఎం తేల్చిచెప్పారు. భూముల క్రమబద్ధీకరణ చేసి అందరికీ న్యాయం చేస్తామన్నారు. కౌలు దారీ వ్యవస్థను పట్టించుకోమన్నారు. ఒకప్పుడు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరు భూమి శిస్తు అని.. ఇప్పుడు దాన్ని రద్దు చేశామన్నారు. ప్రభుత్వమే రైతుబంధు అందిస్తున్నపుడు అనుభవదారు కాలమే అవసరం లేదన్నారు. జాగీర్దార్ల వ్యవస్థ ఉన్నపుడు అనుభవదారు కాలం సరైనదేని..ఇప్పుడు దానితో సన్న, చిన్నకారు రైతులకు నష్టం వాటిల్లుతోందన్నారు.
వివాదాల్లో ఉన్న భూములు చాలా తక్కువ
రాష్ట్రంలో 57.90 లక్షల మంది రైతులకు చెందిన కోటి 48లక్షల 57 వేల ఎకరాల భూమికి రైతుబంధు అందించామని కేసీఆర్ తెలిపారు. కేవలం 48 గంటల్లో రూ.7,200 కోట్ల పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతుబంధు పరిహారం ఒకరిది మరొకరికి వెళ్లిందా అనే అంశంపై విచారణ చేయించానన్నారు. పరిహారం అలా వెళ్లి ఉంటే చాలా గొడవలు జరిగేవని చెప్పారు. రైతుబంధు ప్రకారం వివాదాల్లో ఉన్న భూములు చాలా తక్కువన్నారు. భూముల వివాదాల పరిష్కారానికి సమగ్ర సర్వే సరైన మార్గమని.. వీలైనంత త్వరగా దీన్ని నిర్వహిస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారంలో పాలకులు ప్రేక్షకపాత్ర వహిస్తే నేరం అవుతుందన్నారు. రెండు లేదా మూడు మినహా మిగిలిన చట్టాలను తీసేయడం లేదన్నారు.
పీడ విరగడైందని ప్రజలు భావిస్తున్నారు
గత ప్రభుత్వాలు అవలంభించిన భూ విధానం అశాస్త్రీయంగా ఉందని సీఎం అన్నారు. ఎన్నికలు వచ్చాయంటే పట్టాల పంపిణీ జరిగేదని.. స్థలాలు, హద్దులు చూపకుండానే వాటిని పంపిణీ చేశారని గుర్తు చేశారు. పంచిన భూమి తక్కువ.. పంపిణీ కాగితాలే ఎక్కువని ఆయన వ్యాఖ్యానించారు. అశాస్త్రీయంగా జరిగిన భూ పంపిణీతో సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అటవీ భూముల్లో రాజకీయ దందా చేశారని సీఎం విమర్శించారు. కొత్త రెవెన్యూ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడంతో ప్రజలంతా బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకొంటున్నారని కేసీఆర్ చెప్పారు. దీనిపై ప్రజల్లో అద్భుతమైన స్పందన వస్తోందని.. పీడవిరగడైందని భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతులకు అండదండగా ఉండటమే తమ విధానమన్నారు. మంచి వ్యవస్థ వచ్చినపుడు కొంత కఠినంగా ఉంటుందని.. ఆ పరిస్థితి తప్పదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’: హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్