సీఎం అభ్యర్థి కన్నా ‘నోటా’కే ఎక్కువ ఓట్లు!
ఉత్కంఠ రేపిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నీతీశ్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే పైచేయి సాధించింది. జేడీయూ కన్నా భాజపాకే అత్యధిక స్థానాలు దక్కినప్పటికీ సంకీర్ణాల చాణుక్యుడిగా పిలవబడే నీతీశ్కే మరోసారి సీఎం పీఠం దక్కడం విశేషం. అయితే, ఈ .........
ఇంటర్నెట్ డెస్క్: ఉత్కంఠ రేపిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నీతీశ్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే పైచేయి సాధించింది. జేడీయూ కన్నా భాజపాకే అత్యధిక స్థానాలు దక్కినప్పటికీ సంకీర్ణాల చాణుక్యుడిగా పిలవబడే నీతీశ్కే మరోసారి సీఎం పీఠం దక్కడం విశేషం. అయితే, ఈ ఎన్నికల్లో 7లక్షల మందికి పైగా ఓటర్లు ఏ అభ్యర్థి పట్లా ఆసక్తి ప్రదర్శించకపోవడం గమనార్హం. రాష్ట్రంలో 7,06,252 (1.7శాతం) మంది ఓటర్లు ‘నోటా‘ (నన్ ఆఫ్ ది ఎబోవ్) మీట నొక్కడం అనేక స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి. అలాగే, ఈ ఎన్నికల్లో లండన్ నుంచి వచ్చి ప్లూరల్స్ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన 28 ఏళ్ల పుష్పమ్ ప్రియ చౌధురి ఘోరంగా ఓటమి చవిచూశారు. రెండు స్థానాల నుంచి పోటీచేసిన ఆమె ప్రత్యర్థుల చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఒకచోట నోటా కన్నా తక్కువ ఓట్లు రాగా.. మరో స్థానంలో డిపాజిట్ కూడా దక్కలేదు.
దర్భంగాకు చెందిన పుష్పమ్ ప్రియా చౌధురి జేడీయూ సీనియర్ నేత వినోద్ చౌధురి కుమార్తె. లండన్లో స్థిరపడిన ఆమె తండ్రి ఎమ్మెల్సీగా ఉన్న పార్టీలో చేరకుండా ఈ ఎన్నికల్లో ‘ప్లూరల్స్’ పేరుతో కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించి ఇటీవలే బిహార్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. బిహార్ అభివృద్ధి కోసం ప్రజలు తనకు మద్దతివ్వాలని అభ్యర్థించారు. తాను సీఎం అయితే 2025 నాటికి బిహార్ను దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానన్న హామీతో ఎన్నికల బరిలో దిగినప్పటికీ ప్రజలు ఆమెను ఆదరించలేదు. బిస్ఫీ నియోజకవర్గంలో పుష్పం ప్రియకు 1521 ఓట్లు రాగా.. ఆరో స్థానంలో నిలిచారు. ఇక్కడ భాజపా అభ్యర్థి హరిభూషణ్ ఠాకూర్కు 86వేల పైచీలుకు ఓట్లు రాగా.. నోటాకు 2929 ఓట్లు రావడం గమనార్హం. అలాగే, మరో స్థానం బంకీపూర్లో 5189 ఓట్లతో ఆమె పదో స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ నోటాకు 1213 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడా ప్రియ భాజపా చేతిలోనే ఓడిపోయారు.
నోటాకు ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో 11 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ‘నోటా’కు భారీగానే ఓట్లు వచ్చాయి. బిహార్లో మొత్తం 243 స్థానాల్లో 7,06,252 (1.69 శాతం) మంది ఓటర్లు ‘నోటా’(నన్ ఆఫ్ ది ఎబోవ్) మీట నొక్కినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 2013లో నోటా ఎంపికను ఓటింగ్ యంత్రాల్లోకి చేర్చిన విషయం తెలిసిందే.
* తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలో నోటాకు 554 ఓట్లు వచ్చాయి.
* మధ్యప్రదేశ్లో 28 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 39,787 ఓట్లు పడ్డాయి
* గుజరాత్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నోటాకు 24,732 ఓట్లు వచ్చాయి.
* ఛత్తీస్గఢ్ ఒక స్థానంలో 3,787 ఓట్లు
* హరియాణాలో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా నోటాకు 5003 ఓట్లు పడ్డాయి.
* ఝార్ఖండ్లో రెండు స్థానాల్లో 5773 ఓట్లు
* కర్ణాటకలో రెండు స్థానాల్లో 3140 ఓట్లు
* మణిపూర్లో ఐదు స్థానాల్లో 522 ఓట్లు
* నాగాలాండ్లో రెండు స్థానాల్లో 4773 ఓట్లు
* ఒడిశాలో రెండు స్థానాల్లో 1486 ఓట్లు
* యూపీలో ఏడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నోటాకు 8755 ఓట్లు పడ్డాయి.
* బిహార్లోని వాల్మికినగర్ లోక్సభ ఉప ఎన్నికలో నోటాకు 41041ఓట్లు పడ్డాయి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
మహారాష్ట్రలోని బారామతిలో ఉత్కంఠ పోరు నెలకొంది. పవార్ కుటుంబంలోని ఇద్దరు మహిళలు పరస్పరం తలపడటం ఉత్కంఠ రేపుతోంది. -
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్డీఏ కూటమి నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. -
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
తెలుగుదేశం అభ్యర్థులకు అధినేత చంద్రబాబు ఈనెల 21న బీఫామ్లు అందజేయనున్నారు. -
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నారా లోకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. -
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
భీమిలి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైకాపా నేతలు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. -
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. -
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
వైఎస్ఆర్ హయంలో హంద్రీనీవా ప్రాజెక్టు 90 శాతం పూర్తి అయిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పూర్తి చేసి -
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
మాజీ మంత్రి వివేకానందరెడ్డి 40 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేశారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. -
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీకి చెందిన గూండాలు అరాచకం సృష్టించారు. -
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
కాంగ్రెస్కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో భాజపా (BJP) విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు. -
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. -
వాల్తేరు క్లబ్లో వైకాపా డిష్యుం డిష్యుం!
వాల్తేరు క్లబ్ ప్రభుత్వ భూమి. ఈ రోజుకూ నేను అదే చెబుతున్నా. ఏ రోజైనా ఒక సామాజికవర్గం చేతిలో ఉండి ఉండొచ్చు. -
నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు
నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు (Lok sabha Elections) నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. -
చీకటి పాలనకు చిరునామా.. జగనన్న కాలనీలు!
ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తాం.. అంటూ జగనన్న కాలనీల విషయంలో సీఎం జగన్ మొదటి నుంచీ గొప్పలు చెబుతున్నారు. -
వ్యూహకర్తలదే పెత్తనం!.. ప్రచారంలో పార్టీలను శాసించేది వారే
భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పెత్తనం పెరిగిపోయింది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించే రోజులు పోయాయి. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ