వలస కూలీల గణాంకాలు ఎందుకు లేవు?
కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వలస కూలీలకు పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కరోనా పరిస్థితిపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత.....
మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వండి: ఆనంద్ శర్మ
దిల్లీ: కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వలస కూలీలకు పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కరోనా పరిస్థితిపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ఈ విషయాన్ని లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు. లాక్డౌన్ కాలంలో మరణించిన వలస కార్మికుల వివరాలు లేవు గనక వారికి పరిహారం ఇవ్వబోమని కేంద్రం చెప్పడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వలస కూలీల గణాంకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఎవరు చనిపోయారో రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుస్తుందని, పరిహారం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్లోనైనా వలస కూలీలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాలని కోరారు. నగరాల్లో నివసిస్తూ ఆహార భద్రతలేని, రేషన్ అందని వారిని గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలన్నారు.
ఎక్కడెక్కడ భవన నిర్మాణ కార్మిక శిబిరాలు ఉన్నాయో, అక్కడ ఎంతమంది పనిచేస్తారో స్థానిక పరిపాలనాధికారులకు తెలుస్తాయని ఆనంద్ శర్మ అన్నారు. లాక్డౌన్ కాలంలో బాధాకరమైన ఘటనలు చోటుచేసుకున్నాయని.. ఇలాంటివి దేశానికి మంచిది కాదన్నారు. ఎంతోమంది కార్మికులు కాలినడకన వేలాది కి.మీల మేర నడిచి సొంతూళ్లకు వెళ్లారని తెలిపారు. కొందరైతే తమ స్వస్థలాలకు చేరుకొనేందుకు సిమెంట్ మిక్సర్ ట్రక్కుల్లో వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. వారి స్వస్థలాలకు చేరిన తర్వాత వారికి సరైన క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉంటే గ్రామాల్లోకి ఈ వైరస్ వ్యాపించి ఉండేది కాదని ఆనంద్ శర్మ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!