ఆ హామీ నెరవేర్చకపోతే దీక్ష చేస్తా:జగ్గారెడ్డి

ప్రజాసమస్యలపై అసెంబ్లీలో గళం విప్పుతామని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి అన్నారు.

Published : 07 Sep 2020 01:06 IST

హైదరాబాద్‌: ప్రజాసమస్యలపై అసెంబ్లీలో గళం విప్పుతామని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి అన్నారు. వైద్యకళాశాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌ రానున్న 15 రోజుల్లో హామీ నెరవేర్చకపోతే తాను ఆరు రోజులపాటు దీక్ష చేస్తానని చెప్పారు. హైదరాబాద్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

తమ ప్రభుత్వం ఉంటే సులువుగా సమస్యలు పరిష్కారమయ్యేవన్నారు. తెరాస ప్రభుత్వంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కూడా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. తెరాస ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారిపోయారని.. అన్ని సమస్యలపై ప్రభుత్వాన్ని తాను నిలదీస్తానని చెప్పారు.  సంగారెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి సీఎంను కలవాలని భావించినా అనుమతి రాలేదని.. అసెంబ్లీ వేదికగానే సమస్యలను ప్రస్తావిస్తానన్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని