ప్రతి అంశంలోనూ స్పష్టతివ్వాలి: శ్రీధర్బాబు
ప్రభుత్వం శాసనసభలో నూతనంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ బిల్లులో రికార్డింగ్ అథారిటీని ప్రస్తావించలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు అన్నారు.
నూతన రెవెన్యూ బిల్లుపై శాసనసభలో చర్చ
హైదరాబాద్: ప్రభుత్వం శాసనసభలో నూతనంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ బిల్లులో రికార్డింగ్ అథారిటీని ప్రస్తావించలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు అన్నారు. సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, పార్టీషన్ డీడ్ అంశాలని స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ శాసనసభలో నూతన రెవెన్యూ బిల్లుపై జరిగిన చర్చలో శ్రీధర్బాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. జాగీర్ అనే పదానికి ఇప్పటి వరకు నిర్వచనం లేదని.. జాగీర్ భూముల అంశాన్ని పరిశీలించాలని శ్రీధర్బాబు కోరారు. పేర్లు, వివరాల నమోదులో అక్షర దోషాలు ఉంటే ఎవరు సరిచేయాలనేదానిపై బిల్లులో స్పష్టత ఇవ్వలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. భవిష్యత్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ప్రతి అంశంలోనూ స్పష్టత ఇస్తే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రెవెన్యూ అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 16వేల కేసులు ఉన్నాయని.. ప్రతి వెయ్యి కేసుల పరిష్కారానికి ఒక ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషకరమన్నారు. ఇప్పటి వరకు తహసీల్దార్, ఆర్డీవో దగ్గర నమోదు కాని అనేక రికార్డులు ఉన్నాయని.. వాటిపైనా ఆలోచించాల్సిన అవసరముందని చెప్పారు.
ప్రతి రైతుకూ రైతుబంధు అందాలి: సండ్ర
రాష్ట్రంలోని ప్రతి రైతుకూ రైతుబంధు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన వివరాల ఆధారంగా రైతుబంధు ఇవ్వాలని.. సర్వే వ్యవస్థలోని లోపాలను అధిగమించాలని ఆయన సూచించారు. పట్టాదారు పాసుపుస్తకాలు లేకపోవడంతో కొందరికి రైతుబంధు అందడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. రైతులందరికీ పాసు పుస్తకాలు అందేలా చూడాలన్నారు. పోడు భూములకు సంబంధించి రెవెన్యూ, అటవీశాఖకు మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటికి పరిష్కారం చూపాలని సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సంస్కరణలకు మారుపేరు కేసీఆర్: దానం
రాష్ట్రంలో సంస్కరణలకు మారుపేరు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. దేశ చరిత్రలో కేసీఆర్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని ఆయన కొనియాడారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో వారికి ఎలాంటి నష్టం జరగకుండా సీఎం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంపై అభినందనలు తెలిపారు. రెవెన్యూశాఖలో ఉన్న కొన్ని లోపాలను సవరించాలని దానం కోరారు. ధరణి రికార్డుల్లో పూర్తిస్థాయిలో వివరాలు నమోదు చేయాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM