
సచిన్ పైలట్తో కాంగ్రెస్ ముఖ్య నేతల చర్చలు
జైపూర్: రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం క్లైమాక్స్కు చేరింది. అసంతృప్తితో సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్లోనే కొనసాగేందుకు సుముఖత వ్యక్తంచేయడంతో చర్చలు మొదలయ్యాయి. ఈ మేరకు కాంగ్రెస్ వార్ రూమ్లో సచిన్ పైలట్, సహచర ఎమ్మెల్యేలతో పార్టీ అగ్రనేతలు చర్చలు చేపట్టారు. ఈ చర్చల్లో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్, అహ్మద్ పటేల్ పాల్గొన్నారు. మరోవైపు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఈ అంశంపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ప్రియాంకా గాంధీ వాద్రా, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ ఉన్నారు.
అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై అసంతృప్తితో 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి సచిన్ పైలట్ తిరుగుబావుటా ఎగురవేయడంతో రాజస్థాన్లోని కాంగ్రెస్ సర్కార్ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.