కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి.. ఒక్క ఓటుతో ఓటమి
కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం కొనసాగుతోంది. ఫలితాల్లో ప్రధాన రాజకీయ కూటములైన ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీయేల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం..
కేరళలో కొనసాగుతున్న ‘స్థానిక’ లెక్కింపు
తిరువనంతపురం: కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం కొనసాగుతోంది. ఫలితాల్లో ప్రధాన రాజకీయ కూటములైన ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీయేల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. వామపక్షాల నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 941 గ్రామపంచాయతీల్లో 456 చోట్ల ఎల్డీఎఫ్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 378 గ్రామపంచాయతీల్లో ఆధిక్యంలో ఉంది. భాజపా 30చోట్ల ముందంజలో కొనసాగుతోంది.
కన్నూర్ కార్పొరేషన్లో భాజపా అభ్యర్థి విజయం సాధించారు. తిరువనంతపురంలో ఎల్డీఎఫ్, ఎన్డీయే మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇక ఎర్నాకుళంలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కేవలం ఒకే ఒక్క ఓటుతో ఓటమిపాలవడం గమనార్హం. యూడీఎఫ్ తరఫున ఎర్నాకుళం మేయర్ బరిలో ఉన్న కేఎన్ వేణుగోపాల్.. భాజపా అభ్యర్థి చేతిలో ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయారు. ఫలితాల్లో వేణుగోపాల్కు 181 ఓట్లు రాగా.. భాజపా అభ్యర్థి పద్మాకుమారి 182 ఓట్లతో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి రీకౌంటింగ్ కోరారు. కోచిలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య గట్టి పోటీ నెలకొంది.
కేరళలోని మొత్తం 1200 స్థానిక సంస్థల్లోని 21,893 వార్డులు, 6 కార్పొరేషన్లు, 941 గ్రామ పంచాయతీలు, 14 జిల్లా పంచాయతీలు, 87 మున్సిపాలిటీలకు ఈ నెల 8 నుంచి మూడు దశల్లో పోలింగ్ జరిగింది. బుధవారం ఉదయం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. 2015లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో ఎల్డీఎఫ్ విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. మరికొద్ది నెలల్లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!