గ్రేటర్లో కళ తప్పిన ‘హస్తం’!
సుదీర్ఘమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. తెరాసకు తామే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ నేతలు గొప్పగా చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనబడుతోంది............
జీహెచ్ఎంసీలో ఎన్నికల్లో మళ్లీ పరాభవమే!
ఇంటర్నెట్ డెస్క్: సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈసారి కూడా ఘోర పరాభవం తప్పలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. తెరాసకు తామే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ నేతలు గొప్పగా చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనబడుతోంది. ఒకప్పుడు గ్రేటర్ పీఠాన్ని ఏలిన కాంగ్రెస్.. తాజాగా ఎన్నికల్లోనూ కేవలం రెండు స్థానాలకే పరిమితమైపోయింది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక చూసినా, ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. గ్రేటర్లో కాంగ్రెస్ కళ మసకబారడానికి కారణాలేంటి?
సీన్ రివర్స్ అయిందిలా..
2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 149డివిజన్లలో పోటీచేసిన కాంగ్రెస్ 53 స్థానాలు గెలిచి ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీన్ రివర్స్ అయింది. దీంతో 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే (పటాన్చెరు, నాచారం) పరిమితమైపోయింది. ఈసారి ఏ పార్టీతో పొత్తులేకుండా కదనరంగంలోకి దూకిన కాంగ్రెస్.. మొత్తం 146 చోట్ల అభ్యర్థులను దింపి మళ్లీ రెండు కేవలం స్థానాలే గెలుచుకోగలిగింది. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలను నిలుపుకోలేని ఆ పార్టీ కొత్తగా ఏఎస్రావు నగర్, ఉప్పల్ డివిజన్లలో విజయం సాధించింది. తెలంగాణలో తెరాసకు తామే గట్టిపోటీ ఇవ్వగలమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా.. ఆ స్థాయిలో పనితీరు కనబరచలేకపోతున్నారు. దీంతో ఆ స్థానాన్ని కమలనాథులు ఆక్రమించారు. తెరాసకు తామే అసలు సిసలైన ప్రత్యామ్నాయమంటూ చెబుతోన్న భాజపా.. దుబ్బాకలో ‘కమల వికాసం’తో అధికార పార్టీకి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ విజయం భాజపాకు ఓ టానిక్లా పనిచేయడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో కదనరంగంలోకి దూకి గతంలో కన్నా మెరుగైన స్థానాల్లో దూసుకెళ్తోంది.
ఆకట్టుకోని హామీలు.. రిపీటైన పరాభవం!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండోసారి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటలేకపోయిన కాంగ్రెస్.. ఈసారైనా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలవాలనే పట్టుదలతో రంగంలోకి దిగింది. మహిళలు, విద్యార్థులు, దివ్యాంగులు, వృద్ధులకు మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, కొవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చడం, వరద సాయం రూ.50వేలు ఇస్తామంటూ పలు హామీలను మ్యానిఫెస్టోలో ప్రకటించినా అవేవీ నగర ఓటర్లను ఆకట్టుకోలేకపోయాయి. హైదరాబాద్ అభివృద్ధిలో తమ పార్టీదే కీలక పాత్ర అని, తెరాస- భాజపా దొందూదొందే అంటూ చేసిన ప్రచారం కూడా ఏమాత్రం కలిసిరాలేదనే చెప్పాలి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ రంగంలోకి దిగి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి ఎన్నికలకు సమాయత్తం చేసినా మరోసారి ఆ పార్టీకి ఘోర పరాభవమే రిపీటైంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఉన్నప్పటికీ సరైన ప్రచార వ్యూహాలు లేకపోవడంతో గతంలో గెలిచిన ఆ రెండు స్థానాల్లో పట్టు నిలుపుకోలేకపోయింది. పార్టీ నేతల మధ్య విభేదాలు, సమన్వయ లోపం, సంస్థాగత సమస్యలు కాంగ్రెస్కు శాపంగా మారాయని చెప్పొచ్చు. దీనికితోడు పటిష్ఠ నాయకత్వం కొరత, జాతీయ స్థాయి నాయకత్వంలోనూ అస్పష్టత ప్రజలనే కాదు.. పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నాయనడంలో అతిశయోక్తి కాదు.
గ్రేటర్లో పార్టీని వీడిన కీలక నేతలు
హైదరాబాద్ జంట నగరాల్లో కాంగ్రెస్కు కీలక నేతలు లేకపోవడం కూడా వైఫల్యానికి మరో కారణమని చెప్పొచ్చు. గతంలో ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన దానం నాగేందర్, సబితా ఇంద్రారెడ్డి తెరాసలో చేరడం. అలాగే, మేయర్గా పనిచేసిన బండా కార్తిక రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, విక్రమ్ గౌడ్ వంటి కొందరు నేతలు కాంగ్రెస్కు దూరమయ్యారు. మరోవైపు, కాంగ్రెస్ నుంచి టిక్కెట్లు సాధించిన నేతలు గెలిచాక తెరాసలో చేరుతారనే ప్రచారం కూడా కొన్నిచోట్ల ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2009లో మేయర్గా ఉన్న బండా కార్తీక రెడ్డి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ఉన్న విక్రమ్గౌడ్ ఇటీవల భాజపాలో చేరిన విషయం తెలిసిందే.
ప్రచారానికి దూరంగా అగ్రనేతలు
తెరాస, భాజపా అగ్రనేతలను ప్రచార బరిలోకి దించి హైదరాబాద్లో రాజకీయ కాక పుట్టించాయి. అయితే, కాంగ్రెస్ మాత్రం ఆ స్థాయిలో ప్రచారం నిర్వహించడంలో విఫలమైంది. భాజపా తరఫున అమిత్ షా, జేపీ నడ్డా, ప్రకాశ్ జావడేకర్తో పాటు కిషన్రెడ్డి, యోగి ఆదిత్యనాథ్ వంటి కీలక నేతలు ప్రచారం నిర్వహించినా.. కాంగ్రెస్ అగ్రనేతలెవరూ ప్రచారం చేయలేదు. ఈ ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. ఇలా కొందరు నేతలు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేసే నేతలు లేకపోవడం కూడా ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసిందని విశ్లేషకులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ల కోలాహలం షురూ
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల కోలాహలం ప్రారంభమైంది. రాజకీయ సందడి ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులు గురువారం ఉదయం నోటిఫికేషన్లు జారీ చేశారు. -
ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం
వచ్చే సంవత్సర కాలంలో ఏదైనా జరగొచ్చని, లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేశా
ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. -
పదేళ్లలో రాష్ట్రానికి భారాస, భాజపా చేసింది శూన్యం
గత పదేళ్లలో రాష్ట్రంలోని భారాస, కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
తేనీటి వెనక కన్నీటి ధారలు!
మన దేశంలో వేడివేడి ఛాయ్ మజాను ఆస్వాదించనివారు అరుదు. చాలా ఇళ్లలో చుట్టాలకు తొలి పలకరింపు తేనీటితోనే! పని ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకునేటప్పుడు.. స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడేటప్పుడు.. చాలామందికి టీ కప్పు చేతిలో ఉండాల్సిందే!! -
12 మందికి నేరచరిత్ర
రాజస్థాన్లో లోక్సభకు పోటీ చేస్తున్న 12 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో కొందరిపై హత్య కేసులూ ఉన్నాయి. -
నవనీత్ రాణా.. ఓ నృత్యకారిణి
మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం నుంచి పోటీచేస్తున్న భాజపా అభ్యర్థి, సినీనటి నవనీత్ రాణాపై శివసేన(యూబీటీ) నేత సంజయ్రౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీశాయి. -
సంక్షిప్త వార్తలు
ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. మోదీ వచ్చాకే ఈ ప్రాంతం మిగిలిన దేశంతో మమేకమైంది. -
భాజపా వైపు ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
ఇది వారణాసి, వయనాడ్ మధ్య పోరాటం
తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాహుల్గాంధీని తాము కోరినా వయనాడ్ వైపే మొగ్గు చూపారని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కేరళ రాష్ట్రం వయనాడ్లో కాంగ్రెస్ పార్టీ గురువారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. -
రాహుల్ను ప్రధానిని చేయాలి: తుమ్మల
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 15 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని... రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలను కోరారు. -
మాదిగలకు కాంగ్రెస్ రెండు పార్లమెంట్ సీట్లు కేటాయించాలి
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మాదిగలకు రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్లో అమీర్పేట లీలానగర్లోని తన నివాసంలో గురువారం నిరసన దీక్ష చేపట్టారు. -
భాజపాను అడ్డుకుంటేనే రేవంత్కు, లౌకికవాదానికి మంచిది
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవాలని.. కేరళకు వెళ్లి ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న వామపక్షాలపై ఆయన నోరు పారేసుకోవడం సరైంది కాదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. -
రేవంత్రెడ్డికి ఓట్లడిగే హక్కు లేదు: లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని రాజ్యసభ సభ్యుడు, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ విమర్శించారు. -
రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, వరి, మొక్కజొన్న పంటలకు రూ.500 బోనస్ ఇస్తామంటూ బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నాలుగు నెలల్లోనే కర్షకుల ఉసురు పోసుకుంటోందని, వారిని వేదనకు గురిచేస్తోందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. -
భాజపాతోనే వికసిత తెలంగాణ: గోవా సీఎం
గత పదేళ్లలో తెలంగాణను భారాస అధినేత కేసీఆర్ దోపిడీ చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొల్లగొడుతోందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్సావంత్ ఆరోపించారు. -
ఈటల సేవలు దేశానికి అవసరం
కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందించిన ఈటల రాజేందర్ను లోక్సభ ఎన్నికల్లో గెలిపించి దేశవ్యాప్తంగా ఆయన సేవలు విస్తరిద్దామని కేంద్ర పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖల మంత్రి హర్దీప్సింగ్ పురి అన్నారు. -
రత్నగిరి-సింధుదుర్గ్ భాజపా అభ్యర్థిగా నారాయణ్ రాణె
కేంద్రమంత్రి నారాయణ్ రాణెను మహారాష్ట్రలోని రత్నగిరి-సింధుదుర్గ్ లోక్సభ స్థానం నుంచి బరిలో దింపాలని భాజపా నిర్ణయించింది. -
భారాస నాయకులను చేర్చుకోవద్దు
భారాస నాయకులను కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ వనపర్తి జిల్లా గోపాల్పేట మండల పార్టీ అధ్యక్షుడు గణేశ్గౌడ్, నాయకుడు శేఖర్ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎదుటే పెట్రోలు పోసుకుని నిరసనకు దిగారు. -
అమ్మ మరణాన్ని తట్టుకోలేకపోతున్నా
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హిమాచల్ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్నిహోత్రి కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి విముఖత వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్