రైతులకు సంకెళ్లు హేయమైన చర్య:దేవినేని

రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సంకెళ్లు వేసి అరెస్టు చేయడం హేయమైన చర్య అని తెదేపా సీనియర్‌ నేత,

Published : 31 Oct 2020 01:16 IST

మైలవరం: రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సంకెళ్లు వేసి అరెస్టు చేయడం హేయమైన చర్య అని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు వైకాపా ప్రభుత్వ తీరుపై ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని చెప్పారు. కృష్ణా జిల్లా మైలవరంలో స్థానిక ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి నూజివీడు రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం దేవినేని మీడియాతో మాట్లాడుతూ అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేయడం సీఎం జగన్‌ నిరంకుశతీరుకు అద్దంపడుతోందని విమర్శించారు. రైతుల పోరాటానికి తెదేపా ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని