తృణమూల్లో పెరుగుతోన్న అసమ్మతి..!
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది.
దీదీకి తలనొప్పిగా మారిన తాజా పరిణామాలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. అక్కడ పాగా వేసేందుకు భాజపా ఇప్పటికే వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో తృణమూల్ అధినేతకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. టీఎంసీ కీలక నేత సువెందు అధికారి పార్టీని వీడి భాజపాలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇది మరువక ముందే పార్టీలో అసమ్మతి నేతలు తమ స్వరాన్ని పెంచారు. తాజాగా పార్టీ సీనియర్ ఎంపీ సునీల్ మండల్తో పాటు మరో కీలక నేత జితేంద్ర తివారీ, సువెందుకు మద్దతుగా నిలబడ్డారు. సంస్థాగత సమస్యలను పార్టీ నాయకత్వం సకాలంలో పరిష్కరించడం లేకపోవడంవల్లే ఇటువంటి సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో ఈ తాజా పరిణామాలు దీదీకి తలనొప్పిగా మారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
బర్దమాన్ పుర్బా లోక్సభ స్థానం నుంచి రెండు సార్లు గెలుపొందిన సునీల్ మండల్ తృణమూల్ రెబల్నేతకు మద్దతుగా బహింరంగంగా మాట్లాడటం పార్టీలో కలవరం రేపింది. పార్టీలో నెలకొన్న అంతర్గత పోరు, అవినీతిని నియంత్రించడంలో పార్టీ నాయకత్వం సరైన విధంగా స్పందించడంలేదని సునీల్ ఆరోపించారు. ‘సువెందు అధికారి మంచి నేత, అంతేకాకుండా బలమైన మాస్ బేస్ ఉన్న వ్యక్తి. ఆయన పార్టీని వీడటం ఎన్నికల్లో తృణమూల్కు తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పార్టీలో ఎన్నో సమస్యలున్నప్పటికీ వాటిని పరిష్కరించడంలో నాయకత్వం విఫలమయ్యింది. పాతవారితో కలిసి కొత్తవారు కలిసి పనిచేయాలని పార్టీ నాయకత్వం సూచిస్తోంది. కానీ, అది సాధ్యమయ్యే పనికాదు’ అని సునీల్ మండల్ పేర్కొన్నారు. అయితే, సువెందును కలుస్తారనే ఊహాగానాలపై మండల్ను మీడియా ప్రశ్నించగా.. సువెందు అధికారికి నాకు ఎన్నో ఏళ్లనుంచి పరిచయం ఉందని సునీల్ మండల్ జవాబిచ్చారు.
ఇక, మరో కీలక నేత జితేంద్ర తివారీ కూడా గతకొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. తమ ప్రాంతానికి వచ్చిన కేంద్ర నిధులను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. పార్టీ అంతర్గత విబేధాలపై ప్రశ్నించిన వారిని పార్టీనుంచి వెళ్లిపోవాలని అధికారపార్టీ మంత్రులే సూచిస్తున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాకుండా తృణమూల్లో మమతా బెనర్జీ తర్వాత అత్యంత ముఖ్యమైన మాస్ లీడర్ సువెందు అధికారి అని ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. బర్దమాన్ పుర్బాలో జరిగిన ర్యాలీలో ఈ విధంగా స్పందించిన తివారీ, పార్టీ తరపున ఇదే చివరి ప్రచారం కావచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో జితేంద్ర తివారీ కూడా పార్టీ వీడుతారనే ప్రచారం మొదలయ్యింది.
ఇదిలాఉంటే, బెంగాల్ అటవీశాఖ మంత్రి రాజీవ్ బెనర్జీ కూడా పార్టీలోని ఓ వర్గంపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇలా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కీలక నేతలు వరుసగా అసమ్మతి స్వరాన్ని పెంచడంతో పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి..
అధికారి లేకుండా దీదీ హ్యాట్రిక్ కొట్టగలరా?
అమిత్ షా సమక్షంలో భాజపాలోకి సువెందు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!