దుబ్బాకలో 3 గంటలకు పోలింగ్‌శాతం ఎంతంటే..

దుబ్బాకలో పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి

Published : 03 Nov 2020 15:49 IST

 

సిద్దిపేట: దుబ్బాకలో పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 71.10 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 

నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. కరోనా నేపథ్యంలో ఓటర్ల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో ఓటర్లు భౌతికదూరం పాటించేలా పోలింగ్‌ కేంద్రాల్లో మార్కింగ్‌ వేశారు. పోలింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌ భారతి కొళికెరితో పాటు అధికారులు పరిశీలిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని