‘ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదు’
‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమంపై ప్రతిపక్షం బురద జల్లుతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మంచి కార్యక్రమాన్ని చూసి
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
విజయవాడ: ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమంపై ప్రతిపక్షం బురద జల్లుతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మంచి కార్యక్రమాన్ని చూసి ప్రతిపక్షం కడుపు రగిలిపోతోందని వ్యాఖ్యానించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో 43 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్న ఈ పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు. ఇతర రాష్ట్రాలు ఈ పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి సురేష్ మండిపడ్డారు.
ఈ పథకానికి ఖర్చు చేస్తున్న నిధులు నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వానివేనని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్టిక్కర్ సీఎం కారని.. స్ట్రైకింగ్ సీఎం అని ఆయన పేర్కొన్నారు. పాఠశాల బ్యాగులు, నోట్ పుస్తకాలు, బూట్లు, బెల్టుల ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని స్పష్టం చేశారు. యూనిఫాం, టెక్ట్స్ పుస్తకాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని వివరించారు. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడైనా ఉందా? ‘జగనన్న విద్యాకానుక’పై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రతిపక్షాలకు మంత్రి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారంటే కచ్చితంగా చేసి తీరుతారనే ప్రజలు అనుకుంటున్నారని మంత్రి సురేష్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!