జీహెచ్‌ఎంసీ పోరు: తొలిరోజు 20 నామినేషన్లు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు వివిధ పార్టీలకు చెందిన 17 మంది అభ్యర్థులు 20 నామినేషన్లు...

Updated : 19 Nov 2020 19:13 IST

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు వివిధ పార్టీలకు చెందిన 17 మంది అభ్యర్థులు 20 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో భాజపా నుంచి 2, కాంగ్రెస్ 3, తెరాస 6, తెదేపా నుంచి 5 నామినేషన్లు దాఖలయ్యాయి. గుర్తింపు పొందిన మరో పార్టీ నుంచి ఒకరు, స్వతంత్రులు 3 నామినేషన్లు దాఖలు చేశారు. బరిలో నిలిచే అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. నామినేషన్ల సమర్పణకు మరో రెండు రోజులు మాత్రమే ఉన్నందున రేపు, ఎల్లుండి అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని