భాజపాకు కేంద్ర మాజీ మంత్రి గుడ్బై!
గుజరాత్లో భాజపాకు సీనియర్ ఎంపీ గుడ్బై చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి, బరూచ్ లోక్సభ సభ్యుడు మన్షుక్ భాయి వాసవ పార్టీని వీడుతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్కు లేఖ రాశారు. ఆరు సార్లు లోక్సభకు..........
గాంధీనగర్: భాజపాకు సీనియర్ ఎంపీ గుడ్బై చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి, గుజరాత్లోని భరూచ్ లోక్సభ నియోజకవర్గ సభ్యుడు మన్సుఖ్ భాయి వాసవ పార్టీని వీడుతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్కు లేఖ రాశారు. ఆరు సార్లు లోక్సభకు ఎన్నికైన వాసవ.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. ‘‘పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్నాను. పార్టీ విలువల రక్షణకు కృషిచేశాను. అయితే, అన్నింటికి మించి నేనో మనిషిని. తెలిసో తెలియకో మనిషి తప్పులు చేస్తాడు. నేను చేసిన తప్పు పార్టీకి నష్టం కలిగించకూడదనే ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నా. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో లోక్సభ స్పీకర్ను వ్యక్తిగతంగా కలుస్తాను. లోక్సభ సభ్యత్వానికి సంబంధించిన రాజీనామా లేఖను అందజేస్తా. నా నిర్ణయాన్ని కేంద్ర నాయకత్వానికి తెలియపరచండి’’ అని లేఖలో పేర్కొన్నారు.
వాసవ రాజీనామా అంశంపై భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భరత్ పాండ్యా స్పందించారు. ఆయన రాజీనామా లేఖ సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీకి అందిందన్నారు. మన్షుక్ భాయ్ తనతో మాట్లాడారని చెప్పారు. ఆయనో సీనియర్ ఎంపీ అని, వాసవ లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
మరోవైపు, వాసవ లేవనెత్తుతున్న సమస్యలపై పార్టీ నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. అంతేకాకుండా భాజపా పనితీరుపైనా ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలి తన నియోజకవర్గంలో పలు సమస్యలపైనా గళమెత్తారు. దీంతో పాటు గత వారంలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నర్మదా జిల్లాలోని 121 గ్రామాలను ఎకో సెన్సిటివ్ జోన్లుగా ప్రకటించే నోటిఫికేషన్ను ఉపసంహరించుకొనేలా పర్యావరణ మంత్రిత్వశాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట