గ్రేటర్ పోల్స్: ఈ నగరానికి ఏమైంది?
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఎప్పటిలాగే గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ మందకొడిగానే సాగింది. సాయంత్రం 5గంటల వరకు కేవలం 36.73 శాతం ఓటర్లు మాత్రమే ఓటువేశారు. సాయంత్రం 6గంటల వరకు
ఇంటర్నెట్ డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఎప్పటిలాగే గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ మందకొడిగానే సాగింది. సాయంత్రం 5గంటల వరకు కేవలం 36.73 శాతం ఓటర్లు మాత్రమే ఓటువేశారు. సాయంత్రం 6గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం ఇవ్వడంతో ఈ శాతం మరికాస్త పెరిగే అవకాశం ఉంది. ఈ మధ్యాహ్నం 1గంట వరకు ఒక్కశాతం కూడా పోలింగ్ నమోదు కాని డివిజన్లు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. పోలింగ్ పట్ల నగరవాసుల్లో ఎంత అనాసక్తి ఉందో ఈ పోలింగ్ సరళిని బట్టే అర్థమవుతోంది. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడం, జనంలో నెలకొన్న కరోనా భయం వెరసి గ్రేటర్ ఎన్నికల పోలింగ్పై కొంత ప్రభావం చూపించాయి.
ప్రచారం ఎక్కువ.. ఓటింగ్ తక్కువ!
గత ఎన్నికలకు భిన్నంగా ఈసారైనా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు పోటెత్తించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. పలువురు సెలబ్రిటీలు సైతం ముందుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం నిర్వహించారు. రాజకీయ పార్టీలు కూడా ప్రచారాన్ని హోరెత్తించాయి. తెరాస, భాజపా, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగింది. భాజపా అగ్ర నేతలు సైతం హైదరాబాద్ నగరానికి వచ్చి ప్రచారం హోరెత్తించడంతో రాజకీయం మరింతగా హీటెక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో కనీసం ఈసారైనా పోలింగ్ 50శాతం దాటుతుందని అందరూ ఆశించినా.. గత రెండు ఎన్నికల కన్నా తక్కువ పోలింగ్ నమోదు కావడం గమనార్హం.
ఈ మధ్యాహ్నం 1గంట వరకు అమీర్పేట, తలాబ్ చంచలం డివిజన్లలో కనీసం ఒక్క శాతం కూడా నమోదు కాలేదు. షేక్పేట, సోమాజిగూడ, శాలిబండ, అత్తాపూర్, బేగంబజార్, జియాగూడ, కార్వాన్, అల్విన్ కాలనీ, సుభాష్నగర్, జంగంమెట్ డివిజన్లలో పోలింగ్ ఐదు శాతాన్ని కూడా దాటలేకపోవడం గమనార్హం.
గతంలో ఓటింగ్ శాతం ఇలా..
తాజా ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో మొత్తంగా 74,04,286 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 38,56,770 (52.09%) మంది పురుషులు కాగా, 35,46,487 (47.90%) మంది మహిళా ఓటర్లు. ఇతరులు 669 (0.01%) మంది ఉన్నారు. ఇందుకోసం గ్రేటర్ పరిధిలో 9238 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 42.04శాతం పోలింగ్ నమోదు కాగా.. 2016లో 45.29శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. నగరంతో పోలిస్తే శివార్లలోనే ఎక్కువగా పోలింగ్ నమోదైనట్టు అధికారులు భావిస్తున్నారు. ఆర్సీపురం, పటాన్ చెరు, అంబర్పేట సర్కిళ్లలో అత్యధికంగా పోలింగ్ నమోదు కాగా.. మలక్పేట, కార్వాన్ సర్కిళ్లలో అత్యల్పంగా పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సీఎం జగన్ అవినీతిపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం
ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఛార్జ్షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు
గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
నేడు నామినేషన్ వేయనున్న పురందేశ్వరి
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరం అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది. -
రాష్ట్రంలో నాలుగు చోట్ల మోదీ సభలు
ఎన్డీయే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో నాలుగు బహిరంగ సభలకు హాజరుకానున్నారు. -
అంబటి, అనిల్కుమార్లపై సీఈఓకు తెదేపా ఫిర్యాదు
ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీ కప్పులపై తమ బొమ్మలు ముద్రించి టీ స్టాళ్లకు పంపిణీ చేస్తున్న వైకాపా అభ్యర్థులు అంబటి రాంబాబు, అనిల్కుమార్లపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. -
పొన్నూరు వైకాపా అభ్యర్థిపై చర్యలకు ఆదేశం
గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. -
రాష్ట్రంలో తొలిరోజు 229 నామినేషన్లు
రాష్ట్రంలో తొలిరోజు లోక్సభ స్థానాలకు 39 నామినేషన్లు, శాసనసభ స్థానాలకు 190 నామినేషన్లు దాఖలయ్యాయి. -
21న తెదేపా అభ్యర్థులకు బి-ఫాంలు
తెదేపా అధినేత చంద్రబాబు ఈ నెల 21న పార్టీ అభ్యర్థులకు స్వయంగా బి-ఫాంలు అందజేయనున్నారు. -
పవన్ సమక్షంలో జనసేనలో చేరికలు
మాజీ మంత్రి దివంగత వట్టి వసంతకుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్కుమార్ సహా పలువురు నాయకులు గురువారం జనసేనలో చేరారు. -
ఎఫ్ఓఏల ద్వారా ‘ఐ ప్యాక్’కు రూ.270 కోట్ల మళ్లింపు
వాలంటీర్ల పర్యవేక్షణ, శిక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీల(ఎఫ్ఓఏ) ద్వారా సుమారు రూ.270 కోట్లను ఐ ప్యాక్కు జగన్ ప్రభుత్వం మళ్లించిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
డీసీసీ పదవి కోసం నా కాళ్లు పట్టుకున్న పెద్దిరెడ్డి
తన కాళ్లు పట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డీసీసీ అధ్యక్షుడయ్యారని, లేదంటే కాణిపాకంలో కానీ, తరిగొండలోగానీ ప్రమాణం చేయాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘గులకరాయి’ కేసు దర్యాప్తు సాక్షిలోనే ఎందుకొస్తోంది?: వర్ల
సీఎం జగన్పై రాయి దాడి కేసులో పోలీసుల దర్యాప్తు వివరాలు ఒక్క సాక్షి పత్రికలోనే ఎందుకొస్తున్నాయని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
నామినేషన్ల కోలాహలం షురూ
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల కోలాహలం ప్రారంభమైంది. రాజకీయ సందడి ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులు గురువారం ఉదయం నోటిఫికేషన్లు జారీ చేశారు. -
ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం
వచ్చే సంవత్సర కాలంలో ఏదైనా జరగొచ్చని, లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేశా
ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి