కిశోర్‌ మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సన్నిహితుడు నలంద కిశోర్‌ మరణానికి వైకాపా ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెదేపా నేత చినరాజప్ప డిమాండ్ చేశారు. ..

Updated : 26 Jul 2020 14:59 IST

అమరావతి: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సన్నిహితుడు నలంద కిశోర్‌ మరణానికి వైకాపా ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెదేపా నేత చినరాజప్ప డిమాండ్ చేశారు. ‘ఓవైపు కరోనా విజృంభిస్తుంటే మద్యం దుకాణాల సమయం పెంచడమా?’ అని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతోందని చినరాజప్ప మండిపడ్డారు. క్వారంటైన్‌ కేంద్రాలకు వచ్చే కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆరోగ్యకరమైన భోజన సదుపాయాలను ప్రభుత్వమే కల్పించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని