రాష్ట్రాలను సంప్రదించకుండానే చట్టాలా!: పవార్
రాష్ట్రాలను సంప్రదించకుండా వ్యవసాయ చట్టాలను తీసుకురావడం సరైన పద్దతి కాదంటూ కేంద్ర ప్రభుత్వంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్వహించే చర్చల ఫలితాన్ని బట్టి ప్రతిపక్షాలు భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తాయని ఆయన తెలిపారు.
రాష్ట్రాలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి
దిల్లీ: రాష్ట్రాలను సంప్రదించకుండా వ్యవసాయ చట్టాలను తీసుకురావడం సరైన పద్దతి కాదంటూ కేంద్ర ప్రభుత్వంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్వహించే చర్చల ఫలితాన్ని బట్టి ప్రతిపక్షాలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు గత నెలరోజులకు పైగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసింది.
రాష్ట్రాలతో చర్చించాలి
రైతుల ఆందోళనలను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలను అవమానించడం సరికాదు. రైతు సంఘాలతో ప్రభుత్వం బుధవారం జరిపే చర్చల ద్వారా వారి సమస్యలకు పరిష్కారం చూపాలి. లేదంటే ప్రతిపక్షాలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాయి. ప్రభుత్వం ఏవైనా సంస్కరణలు చేపట్టేటప్పుడు అన్ని రాష్ట్రాలతో చర్చించాలి. చర్చించాక అంతా సవ్యమే అనుకుంటేనే ముందుకు వెళ్లాలి. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు మేం కూడా సాగురంగంలో పలు సంస్కరణలు చేపట్టాలని అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన విధంగా కాదు. అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు, నిపుణులతో మేం సుదీర్ఘ చర్చలు జరిపాం.
రైతులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు
వ్యవసాయం దిల్లీలో కూర్చుంటే జరిగే పని కాదు. మారుమూల గ్రామాల్లో రైతులు కష్టపడితే జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం పెద్ద బాధ్యత ఉంటుంది. కాబట్టి అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులను సంప్రదించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఆయా రాష్ట్రాల ప్రతినిధుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నమ్మకం కలిగించాలి. ఆ తర్వాతే ముందుకు వెళ్లాలి. ప్రభుత్వం రైతులతో చర్చలకు వ్యవసాయ రంగం గురించి తెలిసిన వారిని పంపించాలి. కేంద్రం రైతులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఒకవేళ కేంద్రం వారికి ప్రాధాన్యత ఇచ్చేటట్లయితే ఈ సమస్య ఇన్ని రోజులు కొనసాగేది కాదు.
ప్రతిపక్షాలను నిందించడం సరికాదు
ప్రజాస్వామ్యంలో చర్చలు అనేవి జరపడం ఎంతో ముఖ్యం. చర్చలతోనే దేనికైనా పరిష్కారం దొరుకుతుంది. ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాల ద్వారా కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) వ్యవస్థ ముగిసిపోతుందని రైతులు అనుకుంటున్నారు. కాబట్టి ఆ సమస్యను ఉద్దేశించి ప్రభుత్వం వారికి స్పష్టమైన వివరణ ఇవ్వాలి. రైతుల ఆందోళనల్లో రాజకీయ పార్టీల హస్తం ఉందని ప్రధాని మోదీ ఆరోపించారు. కానీ ఆయన అలాంటి మాటలు అనడం సరికాదు. ఎందుకంటే రైతులు తమ నిరసనల్లోకి రాజకీయ నాయకుల్ని రావద్దని ఇప్పటికే స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా నిరసనలకు వచ్చి తమకు మద్దతు తెలపాలనుకుంటే రైతుగానే రావాలని వారు చెప్పారు. డిసెంబర్ 30 చర్చల ఫలితాన్ని బట్టి ప్రతిపక్షాల భవిష్యత్ కార్యచరణ ఉంటుందని శరద్ పవార్ ప్రకటించారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!