ఐజీఎస్టీ కమిటీలో హరీశ్‌రావుకు చోటు

ఐజీఎస్టీ పరిష్కారంపై నియమించిన మంత్రుల బృందంలో జీఎస్టీ మండలి.....

Updated : 12 Oct 2022 16:01 IST

దిల్లీ: ఐజీఎస్టీ పరిష్కారంపై నియమించిన మంత్రుల బృందంలో జీఎస్టీ మండలి మార్పులు చేసింది.  ఏడుగురితో కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కొత్త కమిటీలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు చోటు కల్పించింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా బిహార్‌ ఆర్థికమం సుశీల్‌కుమార్‌ మోదీ నియమితులయ్యారు. ఐజీఎస్టీ పరిష్కారం, సంబంధిత అంశాలపై 2019 డిసెంబర్‌లో ఏర్పాటైన ఈ కమిటీలో మార్పులు చేస్తూ కార్యాలయం మెమోరాండం విడుదల చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని